సీఎం జగన్(CM Jagan) రేపు ఎన్నికల మేనిఫెస్టో(Election Manifesto) ప్రకటించనున్నారు. ఇప్పటికే మేనిఫెస్టో పైన పార్టీ ముఖ్యులతో చర్చలు చేసారు. జగన్ బస్సు యాత్రలో వచ్చిన సూచనలు, సలహాల ఆధారంగా మేనిఫెస్టో ఖరారు చేసారు. అయితే, ఈ రోజునే తొలుత మేనిఫెస్టో విడుదల చేయాలని భావించారు. కానీ, రాజకీయంగా మారుతున్న లెక్కలు, ఓట్ బ్యాంక్ ను పరిగణలోకి తీసుకొని చివరి నిమిషంలో మార్పులు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా జగన్ తన మేనిఫెస్టోల కీలక హామీలకు సిద్దం అవుతున్నారు. నవరత్నాలను కొనసాగిస్తూనే కొన్నింటి పరిధి పెంచేలా నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ మేనిఫెస్టో నవరత్నాలకు మించి ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ ప్రక్రియను సులభతరం చేశామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు గ్యాస్ సరఫరా కావడంలేదు. మాడుగులలో గ్యాస్ బుక్ చేసిన వెంటనే వినియోగదారుల మొబైల్…
- నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో పెట్రోల్, డీజల్ నిక్షేపాల అన్వేషణ కలకలం రేపుతోంది. మండలంలోని పలు గ్రామాల్లో చమురు నిల్వలను గుర్తించేందుకు భారీ స్థాయిలో బోరు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. శాటిలైట్ ద్వారా గుర్తించిన పాయింట్ల ఆధారంగా సుమారు 50 బోరు బావుల…
- రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కన్నప్రేమను కాలరాసిన అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. “ఆకలేస్తుంది అమ్మ… అన్నం పెట్టు” అంటూ నమ్మించి పిలిపించి, కన్నతల్లినే ఘోరంగా హతమార్చాడు ఓ కసాయి కొడుకు. మే 4వ తేదీన ముంజేటి స్పందన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 78633