హైదరాబాద్ నగరంలోని ఓ ఫాం హౌస్ లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీని నార్సింగి పోలీసులు, ఎక్సైజ్ శాఖ, Cyberabad SOT పోలీసులు భగ్నం చేశారు. అయితే ఫాం హౌస్ కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాలది కావడంతో హాట్ టాపిక్ గా మారింది. జన్వాడ రిజర్వ్ కాలనిలో ఉన్న రాజ్ పాకాల ఫాం హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందని పోలీసులకు సమాచారం అందించింది. రాజ్ పాకాల ఫాం హౌస్ లో సైబరాబాద్ ఎస్వోటీ, నార్సింగి పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు గుర్తించి, పార్టీలో పాల్గొన్న వాళ్ళ కి డ్రగ్స్ టెస్ట్ చేపించగా అసలు వ్యవహారం బయటపడింది.
డ్రగ్స్ పార్టీ లో పాల్గొన్న ఒక వ్యక్తికి కొకైన్ డ్రగ్ పాజిటివ్ గా తేలినట్లు సమచారం. డ్రగ్స్ తీసుకున్నట్లు మరికొందరికీ సైతం టెస్టుల్లో పాజిటివ్ గా రావడం కలకలం రేపుతోంది. పార్టీలో పాల్గొన్న వారు కొకైన్ తీసుకున్నట్లు డ్రగ్ టెస్ట్ లో తేలడంతో Ndps యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. రాజ్ పాకాల ఫాం హౌస్ లో డ్రగ్స్ పార్టీపై Ndps యాక్ట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ పార్టీలో డ్రగ్స్, విదేశీ మద్యం వినియోగించినట్లు గుర్తించారు. దొరికిన ఫారిన్ బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. Section 34, Excise Act కింద మరో కేసు సైతం నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జన్వాడ ఫాం హౌస్ లో భారీ శబ్దం చేస్తూ పార్టీ నిర్వహిస్తున్నారని పోలీసులు సమాచారం అందింది. డయల్ 100కు ఫోన్ చేసి డ్రగ్స్ పార్టీపై సమాచారం రావడంతో పోలీసులు, సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని డ్రగ్స్ పార్టీని అడ్డుకున్నారు. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న 21 మంది పురుషులు, 14 మంది యువతులు, ఆడవారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. జన్వాడ ఫాం హౌస్ లో లిక్కర్ కు ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని అధికారులు తెలిపారు.
అర్థరాత్రి భారీ డీజే సౌండ్స్ తో డ్రగ్స్ పార్టీ నిర్వహించారని పోలీసులు చెబుతున్నారు. విజయ్ మద్దూరికి డ్రగ్ టెస్టులో పాజిటివ్ గా తేలింది. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా మార్చుతామని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపడంలో భాగంగా యాంటీ నార్కోటిక్స్ కు సంబంధించి ఓ విభాగం ఏర్పాటు చేసి చీఫ్ ను నియమించారు. సీఎం రేవంత్ ఎప్పటికప్పుడూ డ్రగ్స్ నియంత్రణపై ఎక్సైజ్ శాఖ, యాంటీ నార్కోటిక్స్, సంబంధిత విభాగాల అధికారులతో సమావేశమై అప్ డేట్స్ తెలుసుకుంటున్నారు. డ్రగ్స్ అరికట్టేందుకు ఎలాంటి చర్యలైనా తీసుకోవాలని, లేకపోతే యువత చెడ్డదారిని ఎంచుకుని జీవితాలు నాశనం చేసుకునే అవకాశం ఉందని పలుమార్లు ప్రస్తావించారు. గతంలో సన్ బర్న్ పేరుతో డ్రగ్స్ పార్టీలు నిర్వహించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్ కల్యాణ్..ముంబై హాస్పిటల్లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
- హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు చేపట్టింది. అమెరికా కార్మిక శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం.. వీసా మోసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు, సబ్పోనాలు…
- అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…
- భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్తో కలిసి ఇరు దేశాల ప్రముఖ సీఈఓలు, వ్యాపార దిగ్గజాలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల…
- చెన్నై ఎగ్మూర్లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీలు.తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న విజయ్..ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆధారాలతో సహా అవినీతి అధికారుల సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి..తాజాగా ప్రభుత్వాస్పత్రుల్లో ఆకస్మిక…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 194951