చెరకురసంలోని లవణాలు నోటి దుర్వాసనను వదిలించి దంతాలు పుచ్చిపోకుండా కాపాడతాయి. కామెర్ల వ్యాధి తగ్గించడంలో చెరకు రసం మహత్తరంగా పనిచేస్తుంది. జ్వరాన పడ్డప్పుడు కోల్పోయిన ప్రొటీన్ను చెరకు రసం భర్తీ చేయడంలో తోడ్పడుతుంది. మూత్ర సంబంధ సమస్యలను చెరుకు రసం పరిష్కరిస్తుంది. కేన్సర్తో పోరాడే శక్తినిస్తుంది. ముఖ్యంగా ప్రొస్టేట్, బ్రెస్ట్ కేన్సర్ల చికిత్సకు ఎంతో ఉపకరిస్తుంది. శరీర బరువును తగ్గిస్తుంది. గొంతు నొప్పి, ఫ్లూ, జలుబును తగ్గిస్తుంది. చెరుకు రసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని తగ్గించడమే కాక, కణాలు నాశనం కాకుండా చూస్తాయి. దీంతోపాటు శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. మధుమేహం ఉన్నవారు కూడా నిరభ్యంతరంగా చెరుకు రసాన్ని తాగవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలపై ప్రభావం చూపే అవకాశాలు తక్కువగా ఉంటాయని వారు చెబుతున్నారు.
flu
టీ తాగే ముందు మరియు తర్వాత ప్రజలు నీళ్లను సాధారణంగా తాగుతూ ఉంటారు. అయితే కొందరు ఈ పద్ధతి హానికరమని నమ్ముతారు. ఏది ఏమైనప్పటికీ, టీ తాగడానికి ముందు నీరు త్రాగటం నిజంగా ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఎందుకంటే టీ 6 పిహెచ్ విలువను కలిగి ఉంటుంది. మనం తాగే టీలో ఉండే ఆమ్లా గుణాలు మన ప్రేగులను ప్రభావితంచేస్తాయి. కాబట్టి టీ తాగడానికి ముందుగా నీరు తాగడం వల్ల పేగులు హైడ్రేట్ గా ఉంటాయి. ఇది టీలోని యాసిడ్ మన ప్రేగులకు ఎటువంటి హాని కలిగించకుండా నిరోధిస్తుంది. ఎసిడిటీ, డీహైడ్రేషన్, అల్సర్ మరియు దంత క్షయాన్ని నివారించడం వంటి అదనపు ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నందున సాధారణ నీటిపై వెచ్చని నీరు టీ తాగడానికి ముందు తాగవచ్చు. టీ తాగడానికి ముందు నీళ్లు తాగచ్చుగా అని వెంటనే తాగకూడదు, నీళ్లు తాగిన 10-15 నిమిషాల తరువాత టీ తాగవచ్చు. మరొకవైపు టీ తాగిన వెంటనే నీళ్లు తాగడం అస్సలు మంచిది కాదు. టీ తాగిన తర్వాత నీళ్ళే కాదు మరే ఇతర ద్రవాన్ని తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఇది కడుపులో అసౌకర్యం, ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం, గొంతు నొప్పి, జలుబు, ఫ్లూ, తుమ్ములు మరియు ముక్కు నుండి రక్తం కారడం వంటి వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. టీ తాగడం వల్ల దంతాల సున్నితత్వం, క్షయం, జలదరింపు మరియు పసుపు రంగులోకి మారడం ద్వారా దంతాల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. అందువల్ల, టీ తాగిన తర్వాత నీరు త్రాగడానికి ముందు కనీసం ముప్పై నిమిషాలు వేచి ఉండటం మంచిది. ఇది ఏవైనా సంభావ్య సమస్యలను నివారించడానికి మంచిది. దీనితోపాటు ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తాగడం వల్ల మీ పొట్ట పాడవ్వచ్చు లేదా కడుపులో ఆమ్లాలు పెరిగి మీ జీర్ణక్రియను నాశనం చేయవచ్చు, ఉదయపు టీ మీ నోటి నుండి మీ ప్రేగులకు బ్యాక్టీరియాను చేరవేస్తుంది. ఇది మీ జీవక్రియకు అంతరాయం కలిగిస్తుంది. అజీర్ణం మరియు గుండెల్లో మంట కూడా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఖాళి కడుపుతో కూడా టీ తాగడం మంచిది కాదు.
Read Also..
Read Also..
కొవిడ్ మహమ్మారి సృష్టించిన విలయం నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం తేరుకుంటున్న వేళ కరోనా పుట్టిల్లు చైనాలో మరో కొత్త వైరస్ అలజడి రేపుతోంది. చైనా స్కూళ్ల ద్వారా గుర్తించని ఒక న్యుమోనియా వ్యాప్తి చెందుతోంది. ఊపిరితిత్తుల వాపు, తీవ్రమైన జ్వరంతోపాటు అసాధారణ లక్షణాలు పిల్లల్లో కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే సాధారణ దగ్గు, ఫ్లూ, ఆర్ఎస్వీ, ఇతర శ్వాసకోశ వ్యాధుల సంబంధం లక్షణాలు లేవని అంటున్నారు. ఈ వైరస్ కారణంగా ఆసుపత్రుల్లో చేరుతున్న పిల్లల సంఖ్యను చూస్తుంటే కొవిడ్-19 నాటి పరిస్థితులు గుర్తుకు వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితి పట్ల చైనా ఆరోగ్య వ్యవస్థ కలవరం చెందుతోంది. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో పిల్లలు అనారోగ్యానికి గురవ్వడంతో తల్లిదండ్రులు హాస్పిటల్స్కు తీసుకెళ్తున్నారు. రోగులు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో బీజింగ్, లియానింగ్ ప్రావిన్స్లలోని ఆసుపత్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ఆసుపత్రుల వనరులు అడుగంటే స్థితికి చేరుకుంటున్నాయని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా కొత్త రకం న్యుమోనియా వ్యాప్తి కారణంగా పాఠశాలలు మూసివేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని స్థానిక మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మనుషులు, జంతువులలో వ్యాధుల వ్యాప్తిని గుర్తించే ఓపెన్-యాక్సెస్ నిఘా ప్లాట్ఫారమ్ ‘ప్రోమెడ్’ ఈ విషయాన్ని వెల్లడించింది. చైనా ఇంకా నిర్ధారించని న్యుమోనియా పిల్లలను ప్రభావితం చేస్తోందని మంగళవారం అప్రమత్తత ప్రకటించింది. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోందని తెలిపింది. న్యూమోనియా విస్తృతంగా సోకుతోందని, వ్యాపించడం ఎప్పుడు ప్రారంభమైందో స్పష్టంగా చెప్పలేమని ప్రోమెడ్ రిపోర్ట్లో పేర్కొంది. చాలా మంది పిల్లలు ఇంత త్వరగా ప్రభావితం కావడం అసాధారణమని వివరించింది. అయితే ఈ వైరస్ పెద్దలకు కూడా వ్యాపిస్తోందా లేదా అనేది పేర్కొనలేదు. ఇది మరొక మహమ్మారి అని అంచనా వేయడం తొందరపాటే అవుతుందని, అయితే వైరాలజిస్ట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ప్రస్తావించింది. కాగా కరోనాకు ముందు కూడా ‘ప్రోమెడ్’ ఇదే విధంగా హెచ్చరించింది. వైరస్ వ్యాపించకముందే డిసెంబర్ 2019 చివరలో ఒక రిపోర్ట్ ద్వారా హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థలోని వివిధ ఉన్నత స్థాయి అధికారులతోపాటు వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలను అప్రమత్తం చేసింది. ఆ తర్వాత దానిని కరోనాగా గుర్తించారు. ప్రపంచం మొత్తం ఏవిధంగా ఇబ్బంది పడిందో అందరికీ తెలిసిందే.





Total views : 77908