రామేశ్వరం కేఫ్ ను ప్రారంభించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, సివిఆర్ న్యూస్ అధినేత చలసాని వెంకటేశ్వరరావు.. మాదాపూర్ లోని ఇమేజ్ క్యాపిటల్ పక్కన ద రామేశ్వరం కేఫ్ చాలా పేరుగాంచిందని ఎమ్మెల్యే అన్నారు. మాదాపూర్ లో రామేశ్వరం కేఫ్ చాలా మంది మన్ననలను పొందుతుందన్నారు. గత కొద్ది రోజుల నుంచి రామేశ్వరం కేఫ్ లో ఉచితంగా టిఫిన్ టి అందిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో చాలా ఫేమస్ అయిన రామేశ్వరం కేఫ్ ఇక్కడ కూడా పేరు తెచ్చుకుంటుందని అన్నారు. రామేశ్వరంలో మొదలైన రామేశ్వరం కేఫ్ సంస్కృతి సాంప్రదాయాలకు విలువనుస్తుందన్నారు. అనేక రాష్ట్రాల ప్రజలు ఉన్న శేరిలింగంపల్లిలోని మాదాపూర్ లో రామేశ్వరం కేఫ్ ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు.
gandhi
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అగ్రనేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 17న తెలంగాణలో పర్యటించనున్నారు. ఆ రోజున ఆయన మూడు బహిరంగ సభలలో పాల్గొంటారు. పాలకుర్తి, వరంగల్, భువనగిరిలలో నిర్వహించనున్న బహిరంగ సభలలో రాహుల్ గాంధీ పాల్గొంటారని ఆ పార్టీ తెలిపింది. రాహుల్ గాంధీ తెలంగాణలో వివిధ తేదీలలో మొత్తం ఆరు రోజుల పాటు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీ వెల్లడించింది. ఒకేరోజు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఒకటి రెండు రోజుల్లో ప్రి-యాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే పర్యటనల తేదీలను పార్టీ ఖరారు చేయనున్నట్లు చెబుతున్నారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలో పార్టీల అగ్రనేతల పర్యటనలు ఉండేలా చూస్తున్నారు.





Total views : 78076