డ్రోన్లను వినూత్నంగా ఉపయోగించేందుకు ఏపీ ప్రభుత్వం దేశం లోనే ఎక్కడా లేని విదంగా అతిపెద్ద డ్రోన్ సమ్మిట్ ను ప్రారంభించింది.తాజాగా ఏపీ పోలీసులు గంజాయి సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ తో అల్లూరి జిల్లా పెదబయలు మండలంలోని వనభంగి పంచాయితీ జడిగూడ గ్రామ పరిధిలో గల అటవీ శాఖ భూముల్లో 15 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు. ఎస్పి అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు గంజాయి తోటలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం పెదబయలు మండలం వనభంగి పంచాయతీ జజిగూడ గ్రామ పరిధిలో గల అటవీ శాఖ భూముల్లో సాగు చేస్తున్నట్లు డ్రోన్ ల సహాయంతో గుర్తించారు.
ఈ మేరకు పెదబయలు ఎస్ఐ రమణ , అటవీశాఖ సెక్షన్ అధికారులు, గ్రామ రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు.పెదబయలు స్థానిక ఎస్సై రమణ మాట్లాడుతూ.. అక్రమంగా సాగు చేస్తున్న 18 మంది రైతులు గుట్టుగా గంజాయిని సాగు చేస్తున్నారని ఏపుగా పెరిగిన గంజాయి మొక్కలను ధ్వంసం చేసి దహనం చేసినట్టు తెలిపారు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం…
- ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కోరారు. న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, కేబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి.టు లారెల్ జూనియర్తో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో భారీగా వరి ఉత్పత్తి…
- హైదరాబాద్లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.హైదరాబాద్ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్లో తొలిసారిగా అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ IREC-2026 హైదరాబాద్లో జరగనుంది. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మూడు రోజుల పాటు ఈ…
- వైసీపీకి గుడ్బై చెప్పిన చిన్న శ్రీను.ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం వైసీపీకి రాజీనామా చేసిన చిన్న శ్రీను..…
- స్పీకర్పై వ్యాఖ్యల వెనుక ఫామ్హౌస్ కుట్ర: భట్టి.స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత వ్యాఖ్యల ఘటన వెనుక ఫామ్హౌస్ కుట్ర ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత్రధారులు వేరని.. సూత్రధారులు వేరని, సూత్రధారులు చాలా ప్రమాదకరమని అన్నారు. దళిత వర్గాల నుంచి వచ్చి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి