రేవంత్ రెడ్డికి దమ్ముంటే అమరవీరుల స్థూపం వద్ద చర్చకు రావాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరారు. నిత్యం అబద్దాలే ఊపిరిగా బతుకుతున్న రేవంత్ రెడ్డి.. చిన్న పిల్లల ముందు కూడా చక్కగా అబద్దాలు చెప్పారని ఎద్దేశా చేశారు. గత ప్రభుత్వ హయాంలో గురుకులాలకు ఏం చేయలేదని, డైట్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు ఇవ్వలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అంతేగాక గురుకులాల ప్రతిష్టను పూర్తిగా మంట గలిపారని, అందుకే గురుకులాలను రిపేర్ చేసే బాధ్యత తీసుకున్నానని చెప్పినట్లు తెలిపారు.
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఒక్క గురుకులాలకే కాదు.. అన్ని సాంఘీక సంక్షేమ విద్యాలయాలకు డైట్ చార్జీలు పెంచారని తెలిపారు. అలాగే తెలంగాణలో ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో 53 మంది విద్యార్థులు మరణిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. పిల్లలు చనిపోతుంటే కదలని ప్రభుత్వం.. ఒకే మెనూ పేరుతో పిల్లలతో కలిసి భోజనం చేసి, పెద్ద డ్రామా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు చేసిన గురుకుల బాట కార్యక్రమం పిక్నిక్ లాగా జరిగిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 90724