వరంగల్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. భూపాలపల్లి, జయశంకర్, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో.
ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా వరి, పత్తి పంటలకు నష్టం చేకూరనుంది. దీంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది.
Heavy rains
మీచాంగ్ తుఫాను ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మీచాంగ్ తుఫాను ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ల ఆదేశాలు జారీ చేశారు. 24 గంటలూ పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండాని జారీ చేశారు. మరో వైపు రేణిగుంట విమానాశ్రయంలో పలు విమానాలు రద్దు చశారు. తిరుపతి నుంచి వెళ్లే పలు రైళ్లను కూడా రైల్వే శాఖ రద్దు చేసింది. వర్ష తీవ్రత పెరుగుతుండడంతో గోగర్భం డాం గేట్లను ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం ఉంటే తప్ప ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు రావద్దు అంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Read Also..
Read Also..
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలుపొంగిపొర్లుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో కాజ్వేల పై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించింది. కాజ్వేల పై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో తొట్టంబేడు మండలంలోని బోనుపల్లి, అంజూరు,సూరమాల, కంచనపల్లి,గుండిపేడు,కాళంగి, రంగయ్యగుంట,ఆదవరం వంటి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు పొంగిపొర్లడంతో పలు గ్రామాల్లో చేన్లలో నీరు చేరడంతో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నా అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
మిచౌంగ్ తుఫాన్ కారణంగా నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తున్నాయి. సూళ్ళూరుపేట మండలం నందు గల కాళంగినది, మరియు పాముల కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. పాముల కాలువ కాదలూరు గ్రామము నకు వెళ్ళు రోడ్డు, తారకేశ్వరా టెక్టైల్ పార్కు కంపెనీ, వట్రపాలం, మన్నారుపోలూరు రోడ్డు ప్రాంతములలో వరద నీరు వచ్చి చేరుకుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండగా మారి తుఫాన్ గా మారబోతున్న నేపథ్యంలో అపరమతమైన జిల్లా యంత్రాంగం. అన్ని శాఖల సిబ్బందిని అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ హరి నారాయణ. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 1077ఏర్పాటు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్. ఎలాంటి పరిస్థితులైన ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించిన జిల్లా కలెక్టర్…, ప్రస్తుతం నెల్లూరుకి 860 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం. ఈ రాత్రికి లేదా రేపు ఉదయం తుఫాన్ గా మారే అవకాశం. తీర ప్రాంతంలోని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్ష ప్రాంతాలు తరలించుకు రంగం సిద్ధం చేసిన జిల్లా యంత్రాంగం…
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజుల నుండి నెల్లూరు నగరం తో పాటు జిల్లా వ్యాప్తంగా వర్షాలు. నెల్లూరు రూరల్, కోవూరు,రాపూరు, ఉదయగిరి ప్రాంతాలలో కురుస్తున్న మోస్తారు వర్షాలు. వర్షాలతో స్తంభించిన జనజీవనం.. చిన్నపాటి వర్షాలకే నదులను తలపిస్తున్న రోడ్డులు. నెల్లూరు నగరంలోని అండర్ బ్రిడ్జిల అన్నింటిలో పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడంతో వాహనదారుల ఇక్కట్లు.
సూళ్లూరుపేట నియోజకవర్గంలో దొరవారిసత్రం, తడ, మరియు సూళ్లూరుపేట తదితర ప్రాంతాల్లో ఈ ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఓ మోస్తారు వర్షం. ఈ చిన్నపాటి వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారాయి. ఇకనైనా సూళ్లూరుపేట మున్సిపాలిటీ అధికారులు, మరియు పాలకులు గుంతలుగా మారిన రోడ్లని మరమ్మత్తులు చేపిస్తే వాహనదారులకు, మరియు పాదచారులకు మేలు చేసిన వారు అవుతారని ప్రజలు కోరుకుంటున్నారు..
దేశంలోని పలు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర సహా పలు చోట్లు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత రెండులుగా కురిసిన అకాల వర్షాలతో గుజరాత్ అతలాకుతలమైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో పిడుగులు పడి సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. సోమవారం రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్, రెడ్ అలర్ట్ జారీ చేసింది.
గత కొన్ని రోజులుగా కేరళ , తమిళనాడు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రెండు రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరిలోనూ ఎడతెరిపి లేని వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ప్రధాన రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. తమిళనాడులోని చెన్నై, తూత్తుకుడి, నీలగిరి, తిరుచ్చిరపల్లి, తిరునెల్వేలి, కన్యాకుమారి, తెన్కాసి, పుదుకోట్టై, విరుదునగర్, తేని సహా పలు జిల్లాల్లో బుధవారం నుంచి ఎడతెరిపి లేని భారీ వర్షం పడుతోంది. దీంతో ఆయా జిల్లాల యంత్రాంగం విద్యా సంస్థలకు ముందుగానే సెలవు ప్రకటించింది. ఇక చెన్నైలో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులన్నీ నీటమునిగాయి. దీంతో ఓ సబ్వేలో బస్సు చిక్కుకుపోయింది. పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది. కేరళలోనూ భారీ వర్షం కురుస్తోంది. పతనంతిట్ట, తిరువనంతపురం జిల్లాల్లో బుధవారం కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రానున్న రోజుల్లో పతనంతిట్టతోపాటు మరో రెండు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు భారీ వర్షం కారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల వెళ్లే రహదారిపై కొండచరిలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
తెలుగు రాష్ట్రాల్లో కురిసే వర్షాలపై భారత వాతావరణ శాఖ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. ఇవాళ, రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వెల్లడించింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ప్రస్తుతం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.