కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం 14వ వార్డు నూకాలమ్మ ప్రక్క వీధిలో యండి.రాజు అనే ఫాస్టర్ తన ఇంటిని చర్చ్ గా మార్చి, రాత్రనకా పగలనకా ప్రార్ధనల పేరుతో పెద్ద పెద్ద సౌండ్ బాక్సులతో నివాస స్థలాల మధ్య ఉన్న కుటుంబాలకు విపరీతమైన భంగం కలిగించడమే కాకుండా, హిందూ దేవుళ్ళను తిడుతూ, భయంకరంగా అరుస్తూ ఏడుస్తుంటే చుట్టు పక్కల వారు భయంతో, మాకు పిల్లల చదువులు, పెద్దలు అనారోగ్యంతో ఉన్నారని కాస్త సౌండ్ తగ్గించమని చెప్పిన, వీళ్లను బెదిరిస్తూ, మీరు మా మతం లోకి మారకపోతే మీరు నాశనమోతారని బెదిరిస్తుంటే, ఎన్నో సార్లు అధికారులకు కంప్లైంట్ చేసిన, వీరి బాధను తీర్చడానికి అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిందువులు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని గత కొన్ని సంవత్సరాలుగా ఈ బాధ అనుభవిస్తున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. చర్చ్ ప్రక్కనే నివశిస్తున్న ఒక వ్యక్తికి వీరు చేస్తున్న అసందర్భ కార్యకలాపాల వలన పెరాలసిస్ కి గురవ్వడం జరిగింది అని అంటున్నారు. ఈరోజు శుక్రవారం స్థానిక హిందువులు తమ ఆవేదనను పోలీసులకు ఫిర్యాదు చేశారు, అక్కడి హిందువులు అందరూ మా వేదనను గుర్తించకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తే మాకు చావే శరణ్యం అని వారి వేదన తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని కొంతమంది స్థానికులు విశ్వ హిందు పరిషత్ బజరంగ్ దళ్ కాకినాడ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర రావు హిందూ, సురేంద్ర దత్త కి ఫోన్ చేసి తెలియజేయగా, హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి హిందువులకు అండగా నిలిచి, వారి మనోవేదనను అధికారులతో మాట్లాడి, ఆ అక్రమ చర్చిని సీల్ చేసి విముక్తి కలిగించాలని డిమాండ్ చేశారు.
Hindu
రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుంది.. ఈ జాతీయ పార్టీల హవా ఉండదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 2024 తర్వాత దేశంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని.. ఏక పార్టీ ప్రభుత్వం రాదని తెలిపారు. అన్ని ఎంపీలు మనం గెలుచుకుంటే బీఆర్ఎస్ తడాఖా అప్పుడు ఢిల్లీలో చూపెడుదామని కేసీఆర్ చెప్పారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నామని… హిందూ, ముస్లిం, క్రైస్తవులు అనే తేడా లేకుండా అన్ని మతాల ప్రజలను కలుపుకొని పోతున్నామని ఈ నేపథ్యంలో ఆయన తెలిపారు. ప్రతి స్కీంలో అందరం భాగస్వామ్యం అవుతున్నామని అందరం సోదరుల్లా కలిసి ఉండి మొత్తం ప్రపంచానికి ఉదాహరణగా ఉంటున్నామన్నారు. పదేళ్లలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా కర్ఫ్యూ లేదు, కల్లోలం లేదన్నారు కేసీఆర్. లా అండ్ ఆర్డర్ పటిష్టంగా మెయింటెన్ చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ముమ్మాటికి సెక్యులర్ పార్టీ అని కేసీఆర్ స్పష్టం చేశారు.
Read Also..
Read Also..