ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. గెలుపే లక్ష్యంగా చేసుకుని పార్టీ కోసం త్యాగాలు చేయటానికైనా ప్రతీ ఒక్కరూ సిద్ధంగా ఉండాలని అధినేత జగన్ మోహన్ రెడ్డి చెప్పకనే చెప్పారు. దీనిలో భాగంగానే నిన్న 11 మంది అభ్యర్థులకు స్థాన చలనం మొదలైంది. ఉత్తరాంధ్ర పై వైసీపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. అభ్యర్థుల మార్పు పై కసరత్తు మొదలుపెట్టింది. అరకు, పాడేరు,అనకాపల్లి, పాయకరావు పేట, ఇచ్చాపురం,చోడవరం ,
పాతపట్నం, ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానాలు లో కొత్త ముఖాలకు చోటిస్తారని తెలుస్తోంది. అరకు , అనకాపల్లి ఎంపీలను అసెంబ్లీ స్థానాలకు, మంత్రి అమర్నాథ్ ను అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయిస్తారని వినిపిస్తుంది.
Tag:
Ichchapuram
శ్రీకాకుళం జిల్లాలలో కొన్ని రోజులుగా పెద్దపులి సంచరిస్తోంది. ఇచ్చాపురం నియోజకవర్గం లోని మండలాల్లోని ప్రజలు భయభ్రాంతులకు గురౌతున్నారు. కంచిలి మండలంలోని మండపల్లి గ్రామంలో ఒక ఆవుల శాలపై పెద్దపులి దాడి చేసి ఒక ఆవును చంపింది. ఉదయం రైతు వచ్చి చూడగా ఒక ఆవు కనిపించడం లేదని గుర్తించాడు. ఆవు కోసం వెతికి చూడగా 100 మీటర్ల దూరంలో చనిపోయిన ఆవు కనిపించింది. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. సమాచారం అందిస్తే గాని ఫారెస్ట్ అధికారులు రాకపోవడం, పెద్దపులి భారీ నుంచి ప్రజలను కాపాడే చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్న అటవీ శాఖ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.




Total views : 80729