మంగళగిరి శ్రీ భద్రావతి సమేత భావనాఋషి స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఫంక్షన్ హల్ ను ప్రారంభించారు విద్య, ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేష్. రానున్న 4 నెలలలో మంగళగిరిని దక్షిణ భారతదేశంలో చెప్పుకోదగ్గ గోల్డ్ హబ్ మారుస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. నియోజకవర్గంలో చేనేత వృత్తిదారులు మరియు గోల్డ్ వర్కర్స్ ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో వారి జీవన విధానాన్ని మారుస్తామన్నారు. మంగళగిరి అభివృద్ధి పథంలో ముందుండే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. పేదరికం లేని మంగళగిరి అభివృద్ధే నా పయనమని నా ప్రతి అడుగు సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తానని మంగళగిరి అభివృద్దే నా ధ్యేయమన్న మంత్రి లోకేష్ అన్నారు . ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ, మురుగుడు హనుమంతరావు, లోకేష్ సతీమణి బ్రాహ్మణి తదితరులు పాల్గొన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- దాసరి నారాయణరావు గారు ఓ ఇన్స్టిట్యూషన్.. ఆయన్ని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి..దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్ను హీరో రాకింగ్ మనోజ్ మంచు, తన సతీమణి భూమా మౌనికతో కలిసి సందర్శించారు. ఈ క్రమంలో దాసరి ఘాట్ దుస్థితిపై యాంకర్ గౌతమి షేర్ చేసిన వీడియోపై…
- అన్నమయ్య జిల్లా అరవీడులో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సుల ప్రమాదం కలకలం రేపింది. గాలివీడు మండలం అరవీడు గ్రామం వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, ప్రమాదంతో కొంతసేపు రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.ప్రమాదం…
- విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..అధిక జ్యేష్ఠమాస పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి కృపను పొందారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, భజనల నడుమ…
- గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో కీలక పరిణామాలు..గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలను నవంబర్లో నిర్వహించే దిశగా అధికారులు ప్రాథమిక కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలు పూర్తైన వెంటనే జీహెచ్ఎంసీకి ప్రత్యేకంగా ఎన్నికల ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పాలనా సౌలభ్యం…
- ఛార్థామ్ యాత్రలో తీవ్ర ట్రాఫిక్ జామ్ …ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. చార్ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ వెళుతున్న భక్తులు భారీ ట్రాఫిక్జామ్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారాంతపు సెలవులు, యాత్రికుల రద్దీ భారీగా పెరగడంతో కేదార్నాథ్ , జోషిమఠ్, గోవింద్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 89300