సిరిసిల్లలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. అయితే స్టేజిపైకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా రావడంతో మంత్రి పొన్నం వారని కొడుతూ కిందకి దింపారు. కార్యకర్తలను చేతుల్తో నెట్టేస్తూ వారించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
karimnagar district news
కరీంనగర్ లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కేటీఆర్ పై విమర్శలు కురిపించారు. కేటీఆర్ ఇంకా అధికారంలో ఉన్నానని భావిస్తున్నడు…అదే అహంకారం కన్పిస్తోంది. కేసీఆర్ పాలనలోని అరాచకాలను, అవినీతిని బయటపెట్టిందే బీజేపీ అంటు విమర్శించారు. అందుకే జనం ఆ పార్టీని బొందపెట్టారని, అయినా సిగ్గు లేకుండా అరువు జిల్లా నేతను తీసుకొచ్చి మొరుగుతున్నడు అని అన్నారు. బండి సంజయ్ ఏం చేసిండో కేసీఆర్ ను రమ్మను చర్చించేందుకు సిద్ధం అన్నారు. నువ్వెన్ని మొరిగినా నీ కుటుంబ గుత్తాధిపత్యాన్ని నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని అయన తెలిపారు.
కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ది మూడో స్థానమే…బీఆర్ఎస్ కు డిపాజిట్ రాదు. ఇక్కడున్న సోకాల్డ్ మేధావి వినోద్ కుమార్ టిప్పర్ దరఖాస్తులు పంపిండు తప్ప ఒక్క పని చేయలేదు. కేసీఆర్ కుటుంబానికి ఆయన ఉపయోగపడ్డారే తప్ప కరీంనగర్ కు చేసిందేమీ లేదని బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్.. జగిత్యాల, వరంగల్ జాతీయ రహదారి పనులకు నిధులు తెచ్చిందెవరు? అంటూ ప్రశ్నించారు. ఆయన ఎంపీగా ఉన్నన్నాళ్లు కరీంనగర్…వరంగల్ రోడ్డు అధ్వాన్నంగా ఉండేవి… యాక్సిడెంట్స్ అవుతుంటే ఎన్నడైనా నిధులు తెచ్చినవా? నేను ఎంపీగా ఉంటూ కేంద్రంతో మాట్లాడి రిపేర్లకు రూ.41 కోట్లు తెచ్చిన అంటూ ఫేర్ అయ్యారు. ఈనెల 28న ఎస్సారార్ కాలేజీలో వేలాది మంది బీజేపీ కార్యకర్తలతో సమ్మేళనం నిర్వహించనున్నారు. ఇక ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ కర్యక్రమానికి రానున్నారు. సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని బండి సంజయ్ పిలుపు నిచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినవి 420 హామీలని మాజీ మంత్రి కెటిఆర్ విమర్శించారు. కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లతో కేటీఆర్ భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదని.. మొత్తం 420 హామీలు ఇచ్చిందని అన్నారు. మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలని అమలు చేయకపోతే బట్టలు విప్పి కాంగ్రెస్ నేతలను నడిరోడ్డుపై నిలబెడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల పేరుతో హామీల అమలును వాయిదా వేయాలని చూస్తోందని.. ఎంపీ ఎన్నికలకు ముందే ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై తెలంగాణ ప్రజలు ఇప్పటికీ విశ్వాసంతో ఉన్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధిస్తామని కేటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పెద్ద ఓటమేమి కాదని.. 39 సీట్లు రావడం చిన్న విషయం కాదని అభిప్రయపడ్డారు. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయని.. కేసులకు ఎవరూ భయపడొద్దని, తాము అండగా ఉంటామని కెటిఆర్ భరోసా ఇచ్చారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్ లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని, తెల్లవారి జామున భోగి పండగ వేడుకల్లో పాల్గొని, భోగి మంటలను వెలిగించి, భోగి సంబరాలను ప్రారంభించి అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికి పెద్దపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణ రావు గారు మాట్లాడుతూ…… సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్లో గత 13 సంవత్సరాల నుండి భోగి పండగ వేడుకలను, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, చిన్నారుల కోలాటాల మధ్యలో అంగరంగ వైభవంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే సంక్రాంతి పండుగ అంటే సిరులు తెచ్చే పండుగ అని, గాంధీ నగర్ ఆదర్శ యూత్, వార్డ్ కౌన్సిలర్ అరుణ బాబురావు ఆధ్వర్యంలో భోగి పండుగ సంబరాలను ఏర్పాటు చేసుకొని నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ సంక్రాంతి పండుగ ఇంటిల్లిపాదికి ఆనందాన్నిచ్చే పండుగ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాల్లో అత్యంత ఆనందంగా జరుపుకునే పండుగ అని, భోగభాగ్యాలు తెచ్చే పండుగ భోగి పండుగ అని ప్రజలంతా సుఖసంతోషాలతో భోగి మంటలు వేసుకుంటారని అన్నారు. పాత వస్తులు అన్ని అగ్నికి ఆహుతిచేసి జీవితాలలో సుఖసంతోషాలు ఉండాలని భోగి మంటలు వేసుకుంటారు. చిన్నపిల్లలు అందరికి ఇంద్రధనస్సుల రంగవల్లులు వేసుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కాలనీ వాసులు, యూత్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి ఆలయంలోకి రాగానే ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలకు భోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా పడాలని, రైతులు బాగుండాలని కోరారు. దేవుడిని కూడ ఈ దేశంలో రాజకీయాలు చేస్తున్నారని, హిందూ సంస్కృతి ఉన్న వారు దేశాన్నీ గౌరవిస్తారని, దేవుడిని సైతం కొందరు స్వంతం అని వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 6 శాస్త్రాలు, 18 పురాణాలు, 12 ద్వాదశ లింగాలు, 18 జ్యోతిర్లిలింగాలు, నాలుగు వేదాలు, నలుగురు జగద్గురు లు ఉన్న దేశంలో వాళ్ళ చేతుల మీదుగా రామాలయం ప్రారంభం చేయాల్సి ఉండగా, రాజకీయాల కోసం దేవుడిని ఎన్నికల కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. పవిత్ర భారత దేశంలో రాజకీయాలను కూడ మార్కెటింగ్ చేస్తున్నారని, మేము ప్రశ్నిస్తే మేము హిందువులకు వ్యతిరేకమని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందుత్వాన్ని విశ్వసించే వారు ఆలోచన చేయాలని, దేవాలయ నిర్మాణం పూర్తి కాలేదని జగద్గురువులు చెబుతున్నారని, దేవుడు కొందరి వాడు కాదు అందరి వాడని, రాముడు, శివుడు, హన్మంతుడు మాకు లేడా అంటే మా పై రాజకీయం చేస్తున్నారన్నారు. దేశం లో మీ ప్రతిష్ట దిగజారుతున్న మీరు ఇంకా రాజకీయం చేస్తున్నారని, పార్లమెంట్ లో ఆదాని, అంబానీ గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని విమర్శించారు. శివరాత్రి కంటే ముందు రాజన్న ఆలయ అభివృద్ధి పై వీటిడీ ఏ మీటింగ్ ఏర్పాటు చేస్తామని, ఎవరు ప్రశ్నించక ముందే వేములవాడ ఆలయ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న యార్డులో ప్రమాదం జరిగింది. యార్డు చివరన నిలిచి ఉన్న యుటిలిటీ ట్రాక్ వెహికల్ ను ఖాళీగా ఉన్న ఐదు వ్యాగన్లు వేగంగా ఢీకొనడంతో బయటికి దూసుకువెళ్ళింది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత రైల్వే యార్డులో షంటింగ్ ఆపరేషన్ జరుగుతున్న సమయంలో గూడ్స్ రైలు నుంచి బోగీలు తప్పి వేగంగా వెళ్లి యుటిలిటీ వెహికల్ ను ఢీకొట్టాయి. అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణాష్టం జరగలేదు. యుటిలిటీ వెహికల్ లో ఓ డ్రైవర్ ఉన్నట్లు తెలిసింది గాని రైల్వే అధికారులు ఎలాంటి సమాచారాన్ని ఇవ్వడం లేదు. ఈ సంఘటనపై రైల్వే అధికారులు ఎంక్వయిరీ చేస్తున్నారు.
వ్యవసాయ మోటర్లను ఎత్తుకెళుతున్న దొంగలను రైతులు కాపుకాసి పట్టుకున్నారు. జగిత్యాల రూరల్ మండలంలోని లక్మిపూర్ గ్రామంలో గత కొంతకాలంగా వ్యవసాయ బావుల వద్ద నుంచి దాదాపు వంద మోటర్ల వరకు చోరీ అయినట్లు రైతులు పేర్కొన్నారు. తమ బాధ్యతగా పోలీసులకు సమాచారం ఇచ్చి రైతులు దొంగల కోసం కాపు కాశారు. బుధవారం ఉదయం ముగ్గురు దొంగలను పట్టుకున్న రైతులు పోలీసులకు అప్పగించారు. సాగు కాలంలో మోటార్లు చోరీకి గురైన రైతులు ఆందోళన చెందగా చివరకు చోరులు పట్టుబడడంతో ఊపిరి పీల్చుకున్నారు.
జగిత్యాల జిల్లాలోని మెట్టుపల్లి పట్టణంలో గల త్రిశక్తి దేవాలయం తూర్పు ద్వారానికి అడ్డుగా గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రి గోడను నిర్మించారు.
ఉదయమే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గుడికి అడ్డుగా ఉన్న గోడను తొలగించి విచారణ చేపట్టారు. త్రిశక్తి దేవాలయ కమిటీ చైర్మన్ ద్యావనపల్లి రాజారామ్ మాట్లాడుతూ ఉదయం గుడికి వచ్చి చూసేసరికి అక్రమంగా గోడ నిర్మించి ఉందని, వెంటనే స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్, సిఐ గారికి సమాచారం అందించామని పోలీసుల ఆధ్వర్యంలో గోడను తొలగించారని, దేవాలయం ముందు ఉన్న ఖాళీ స్థలం అన్ని దేవాలయాలకు సంబంధించిందని ఎమ్మెల్యే గారు ఊరి పెద్దమనుషులు, పోలీసులు చొరవ తీసుకుని ఇలాంటివి మళ్ళీ పునరావృత్తం కాకుండా చూడాలని కోరారు.
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వరరావు పేట గ్రామానికి చెందిన గడ్డం సత్తయ్య అనే వ్యక్తి ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి పెంకుటిల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు నాలుగు లక్షల 50 వేల రూపాయల నగదు, పది తులాల బంగారు నగలు, బట్టలతోపాటు నిత్యావసర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద సమయంలో గడ్డం సత్తయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్ళాడు. ఇరుగుపొరుగువారు సమాచారం ఇవ్వడంతో ఇంటికి వచ్చి చూసేసరికి ఇల్లు పూర్తిగా దగ్ధమైపోయింది. కాయ కష్టం చేసి వడ్లు అమ్మి ఇంట్లో దాచిపెట్టిన నగదు ఇలా పూర్తిగా కాలిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనస్థాపానికి గురి అయ్యారు. ప్రభుత్వము తమను ఆదుకోవాలని వేడుకున్నారు.
ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రియుడు మోసం చేశాడంటూ నిరసనకు దిగిన యువతి…. వివరాల్లోకి వెళితే ముస్తాబాద్ మండలానికి చెందిన కొత్తపల్లి దినేష్ అనే యువకుడు సేవాలాల్ తండాకి చెందిన లకావత్ మంజులతో గత ఎనమిది నెలలుగా సహా జీవనం చేసాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోమని దినేష్ ని అడగడంతో నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని తన రూమ్ లో నుండి మంజులని బలవంతంగా గేంటేసాడు. దీనితో తప్పనిసరి పరిస్థితిలో రోడ్డెక్కిన యువతి. అయితే ఈ యువతికి గతంలోనే వేరే వ్యక్తితో వివాహం అయ్యింది. మాయ మాటలు చెప్పి యువతిని లోబర్చుకున్న దినేష్ అవసరం తిరగానే వదిలించుకోవాలి అని ప్రయత్నిస్తున్నట్లు మంజుల ఆరోపిస్తుంది.





Total views : 89727