బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్… శివలింగంపై తేలు వంటి వారని అభివర్ణించారు. తేలును కొడదామంటే కింద తెలంగాణ అనే లింగం ఉంటుందని అన్నారు. అందుకే కేసీఆర్ అనే తేలును ఓటు అనే ఆయుధంతోనే కొట్టాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ కల సాకారం చేసిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని సూచించారు. అహంకారానికి, ఖమ్మం ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరిచేలా ఖమ్మంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అన్నారు.
Kcr
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కార్నర్ మీటింగ్ లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఒక్కకేసీఆర్ ని ఓడించడానికి ఢిల్లీ, కర్ణాటక నుంచి గుంపులు గుంపులుగా వస్తున్నారు. కానీ సింహం సింగిల్ గానే వస్తుంది. 2014 నుంచి కేసీఆర్ సింగిల్ గానే పోటీ చేస్తున్నాడు. ఢిల్లీ నుంచి కాదు కదా ఎక్కడి నుంచి అయినా రండి. నవంబర్ 30 నాడు తెలంగాణ దమ్మెందో చూపిస్తాం. ఢిల్లీ దొరలకు తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలకు మధ్య జరిగే పోరాటం ఇది. కాంగ్రెస్ కు గాని బీజేపీకి గాని తెలంగాణలో సత్తా ఉన్న నాయకులు లేరు. వాళ్లు బయటి రాష్ట్రాల నుంచి నాయకులను తెచ్చుకుంటున్నారు. షాద్ నగర్ నియోజకవర్గానికి రాబోయే కాలంలో ఐటీ హబ్ తీసుకువస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
చెన్నూరు నియోజకవర్గం కన్నా ప్రజల సమస్యకన్న ఇసుక దందానే బాల్క సుమన్ కు ముఖ్యం అని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మందమర్రి లొ గడప గడప కు కాంగ్రెస్ ప్రచారం లొ భాగంగా మాట్లాడుతూ… రోజుకు ఎన్ని లారీలు వస్తున్నాయి ఎంత వాటా వస్తుంది అనేదే సుమన్ లక్ష్యం. 2014 లో పార్లమెంట్ ఎన్నికల సమయంలో తన పై పోటీ చేసినప్పుడు 100 కోట్లు వివేక్ వి 100 కేసులు నాయంటూ ప్రజలని మభ్యపెట్టిండు. Mp గా mla గా గెలిచి వెయ్యి కోట్లు బాల్క సుమన్ ఎట్ల సంపాదించిండని ఆరోపించారు. ప్రజలు ఈ విషయాలను తెలుసుకుని బాల్క సుమన్ ను నిలదియ్యాలి. నేను ఏ పదవిలో లేనప్పటికి 10 ఏండ్లుగా ప్రజల కష్ట సుఖాలు పట్టించుకుంటు అండగా ఉంటున్న ప్రజలకు సేవ చేసేందుకె చెన్నూరు అసెంబ్లీ బరిలో నిలుచుంటున్న హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. సుమన్ అహంకారం తో ఆఫీసర్లను , నాయకులను, ప్రజలను తిట్టడం బెదిరింపులకు దిగడమే పని. పేదలకు డబులు బెడ్ రూమ్ లు ఇయలేదు గాని కేసీఆర్ తన mla, mp లకు పెద్ద బిల్డింగ్ లు కట్టి ఇచ్చిండు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే..మందమర్రి మున్సిపాలిటీ కి ఎన్నికలు జరిపించేందుకు కృషి చేస్తాను అన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తా అని తన ఇంటికే ఆరు ఉద్యోగాలు ఇప్పించుకున్నాడు. నెలకు 50 లక్షల జీతం కేసీఆర్ కుటుంబ సభ్యులకు వస్తున్నాయి కేసీఆర్ బులెట్ ప్రూఫ్ ఇల్లు కట్టుకున్నాడు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఇళ్ళలు, ఫామ్ హౌజ్ లు ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న పెదలకేమో డబుల్ బెడ్ రూమ్ లు లేవు. ముఖ్యమంత్రి కి అహంకారం పెరిగింది.. అవినీతిలో మునిగిపోయిండు మీటింగ్ లో నెను ఎక్కడ మాట్లాడిన అక్కడ బాల్క సుమన్ మనుషులు కరెంట్ కట్ చేస్తున్నారు. పవర్ కట్ చేస్తే.. నా మాటలు మీ దాకా వినిపియ్యవా. ధరణి ,కాళేశ్వరం, మిషిన్ భగీరథ ఇలా ప్రతి దానిలో కోట్లు కొల్లగొట్టారు. కాంగ్రెస్ మేనిపెస్టో లొ ఆరు గ్యారెంటీ కార్డును ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి అన్నారు.
కొత్తగూడెంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం అన్న కేసీఆర్.. ఎన్నికలు రాగానే ఆగమాగం కావద్దన్నారు. ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం..అన్నీ ఆలోచించి ఓటెయ్యాలన్నారు. ప్రతీ పార్టీ అభ్యర్థుల గురించి తెలసుకోవాలని.. అభ్యర్థి కంటే పార్టీ చరిత్ర చూసి ఓటెయ్యాలన్నారు. సింగరేణికి 134 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. సింగరేణి తెలంగాణ ఆస్తి అని చేత కాని దద్దమ్మల పార్టీ కాంగ్రెస్ పాలనలో సింగరేణి నష్టాల్లో కూరుకుపోయిందన్నారు. అందుకే కేంద్రానికి 49 శాతం వాటా ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. తెలంగాణ వచ్చాక. బీఆర్ఎస్ పాలనలో సింగరేణి లాభాలను రూ.419 కోట్ల నుంచి…రూ.2,184 కోట్లకు తీసుకెళ్లామని కేసీఆర్ తెలిపారు.
Read Also..
Read Also..
ఎంపీ, కోరుట్ల BJP అభ్యర్థి ధర్మపురి అర్వింద్ TPCC చీఫ్ రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యాలు చేశారు. నేటి ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. ‘గొర్లు మింగేటోడు కేసీఆర్ అయితే.. బర్లు మింగేటోడు రేవంత్ రెడ్డి’ అని అన్నారు. కాంగ్రెసు ఓటేసి ఐదేళ్లు నాశనం చేసుకోవద్దన్నారు. ఎన్ని సీట్లు వచ్చినా ఏర్పడేది BJP ప్రభుత్వమేనని, తెలంగాణలో కాంగ్రెస్కు 35 నుంచి 40 సీట్లు దాటే ప్రసక్తే లేదని ఆయన జోష్యం చెప్పారు.
ఈ నెల 13 నుండి 28 వరకు సీఎం కేసీఆర్ పర్యటన మరో 54 నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నియోజకవర్గాల పర్యటన రెండో షెడ్యూల్ ఖరారైంది. ఇప్పటికే అక్టోబర్ 15 నుంచి ప్రారంభమైన అధినేత పర్యటనలు గురువారం నాటికి 12 రోజుల్లో 30 నియోజకవర్గాల్లో విజయవంతమయ్యాయి. ఈ నెల 5 నుండి 8 వ తేదీ వరకు మరో 11 నియోజకవర్గాల్లో సీఎం గారు పర్యటన చేపట్టనున్నారు. రెండవ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13 నుండి 28వ తేదీ వరకు సీఎం కేసీఆర్ గారు 16 రోజులపాటు నియోజకవర్గాల పర్యటన కొనసాగనున్నది. ఇందులో భాగంగా 54 నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో బీఆర్ ఎస్ అధినేత ,సీఎం కేసీఆర్ గారు పాల్గొంటారు. ఈ నెల 28వ తేదీన గజ్వేల్ నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభతో అధినేత పర్యటన ముగియనుంది. దాంతో మొత్తం 95 నియోజకవర్గాల పర్యటన పూర్తికానున్నది.
Read Also..
Read Also..
ఒకపక్క కేసీఆర్ బహిరంగ సభలతో ప్రచారంలో దూసుకెళ్తుండగా మరోపక్క కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవడానికి తన వంతుగా ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గం లోని ఆమనగల్ పట్టణానికి రానున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా విటాయిపల్లిలో పెద్ద ఎత్తున కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. అనంతరం ఆమనగల్ మున్సిపాలిటీ లోని మాడుగుల రహదారిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరుగుతున్న స్థలాన్ని అత్యంత సుందరంగా వేదికను ఏర్పాటు చేసి సమావేశానికి వస్తున్న ప్రజలకు కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది ఎదురవకుండా ప్రత్యేకంగా కుర్చీలను ఏర్పాటు చేశారు ఆమనగల్లు సిఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Read Also..
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారంలో జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నారు. అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. ఎన్నికల ప్రణాళికలో భాగంగా ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఇప్పటికే పాలేరు, సత్తుపల్లి, ఇల్లెందు నియోజకవర్గాలల్లో కేసీఆర్ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మూడోసారి ఖమ్మం, కొత్తగూడెంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. జిల్లాలోని ప్రకాశం స్టేడియంలో బీఆర్ఎస్ నేతలు భారీ బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చేశారు. ఈ సభలో కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావును కేసీఆర్ ఆశీర్వాదిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల ఆవరణలో ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ ప్రసంగిస్తారు. ఉభయ సభలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో గులాబీ నేతలు సీఎం సభ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఖమ్మంలో ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు శనివారం నాడు పరిశీలించారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో ఏర్పాట్లను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు తదితరులు పరిశీలించారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రెండు చోట్ల బరిలోకి దిగేందుకు సిద్దమయ్యారు. కొడంగల్లో తో పాటు కామారెడ్డి బరిలో కూడా నిలువాలని ఉందని , కేసీఆర్ ఫై పోటీ చేసే అవకాశం వస్తే బాగుంటుందని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు అధిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ రావడం తో..రేవంత్ కామారెడ్డి లో కేసీఆర్ ఫై పోటీ కి సిద్ధం అవుతున్నారు. ఈ నెల 6 న ముందుగా కొడంగల్లో రేవంత్ నామినేషన్ వేసి , తర్వాత ఈ నెల 8వ తేదీన కామారెడ్డిలో నామినేషన్ వేయనున్నారు. ఇక రేవంత్ కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతుండడంతో షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయబోతున్నాడు. అలాగే షబ్బీర్ అలీ నామినేషన్కి రేవంత్రెడ్డి వెళ్లనున్నట్లు సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీ ఫుల్ స్పీడ్తో దూసుకెళ్తుంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ ఆయా నియోజకవర్గాలల్లో ప్రత్యర్థులను ఢీకొట్టేలా ప్రచారం చేస్తున్నారు. ప్రణాళికలో భాగంగా నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదివారం నాడు రెండు చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ మేరకు భారీ బహిరంగ సభలను ఆయా నియోజకవర్గాల్లోని గులాబీ నేతలు ఏర్పాట్లు చేశారు. కేటీఆర్ మొదటగా మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో కల్వకుర్తి నియోజకవర్గంలో బహిరంగ సభలో ప్రసగింస్తారు. సాయంత్రం షాద్నగర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్ పాల్గొననున్నారు.
Read Also..
Read Also..





Total views : 89883