బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా తాను చేసిన పోరాటాలు, కేంద్రం నుండి తీసుకొచ్చిన ప్రస్తావిస్తూ రూపొందించిన కరపత్రం ప్రజలను ఆకర్షిస్తోంది. ‘‘నేనెప్పుడూ మీ బిడ్డనే… నిండు మనసుతో దీవించండి’’ పేరుతో రూపొందించిన 2 పేజీల కరపత్రాలను బీజేపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేస్తున్నారు. ‘‘నేనెప్పుడూ మీ బిడ్డను… మీ కళ్ల ముందు పెరిగిన. మీ కాళ్ల మధ్యన తిరిగిన. మీ దీవెనలతోనే ఇంతటి వాడినయ్యా. కరీంనగర్ గల్లీలో తిరిగిన సామాన్యుడిని దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ లో అడుగుపెట్టే అవకాశాన్ని కల్పించారు. పోరాటాల, చైతన్యాల కరీంనగర్ గడ్డపై పుట్టిన బిడ్డగా దేశం కోసం, ధర్మం కోసం కాషాయ జెండా పట్టుకుని ప్రజల పక్షాన పోరాడిన’’ అంటూ కరపత్రాన్ని రూపొందించారు. అంతేగాకుండా ఎంపీగా గెలిపించాక కరీంనగర్ అభివ్రుద్ధి కోసం చేసిన కార్యక్రమాలు, తెచ్చిన నిధులతోపాటు తెలంగాణలోని వివిధ వర్గాల ప్రజల పక్షాన చేసిన పోరాటాలను, జైలుకు వెళ్లిన సందర్భాలను కరపత్రంలో ప్రస్తావించారు. కరపత్రంపై ప్రజల్లో సానకూల చర్చ జరుగుతోంది
నేనెప్పుడూ మీ బిడ్డనే.. నిండు మనసుతో దీవించండి.. పేరుతో కరపత్రాల పంపిణీ
430
previous post






Total views : 141301