తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీ ఫుల్ స్పీడ్తో దూసుకెళ్తుంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ ఆయా నియోజకవర్గాలల్లో ప్రత్యర్థులను ఢీకొట్టేలా ప్రచారం చేస్తున్నారు. ప్రణాళికలో భాగంగా నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదివారం నాడు రెండు చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ మేరకు భారీ బహిరంగ సభలను ఆయా నియోజకవర్గాల్లోని గులాబీ నేతలు ఏర్పాట్లు చేశారు. కేటీఆర్ మొదటగా మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో కల్వకుర్తి నియోజకవర్గంలో బహిరంగ సభలో ప్రసగింస్తారు. సాయంత్రం షాద్నగర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్ పాల్గొననున్నారు.