ముంబైలో నిన్న జరిగిన ప్రపంచకప్ సెమీస్ లో న్యూజిలాండ్ ను ఇండియా చిత్తు చేసింది. ఐసీసీ మెగా టోర్నీలో ఫైనల్స్ కు చేరిన టీమిండియాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. నిన్నటి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ సెంచరీలతో కదం తొక్కారు. 7 వికెట్లను కూల్చి మహ్మద్ షమీ కివీస్ ను మట్టికరిపించాడు. టీమిండియా ప్రదర్శనకు ప్రధాని మోదీ కూడా ఫిదా అయిపోయారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ, షమీలపై ప్రశంసలు కురిపించారు. వన్డేల్లో కోహ్లీ తన 50వ సెంచరీని సాధించడమే కాక… అత్యుత్తమ క్రీడాస్ఫూర్తికి, పట్టుదలకు ఉదాహరణగా నిలిచాడని మోదీ ప్రశంసించారు. ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకోవడం అతని అంకిత భావానికి నిదర్శనమని చెప్పారు. భవిష్యత్ తరాలకు కోహ్లీ ఒక బెంచ్ మార్క్ ను నెలకొల్పుతూనే ఉన్నాడని కొనియాడారు. ఈ మ్యాచ్ లో అద్భుత బౌలింగ్ ప్రతిభను కనపరిచిన షమీకి అభినందనలను తెలుపుతున్నానని చెప్పారు. షమీ ఎంతో బాగా ఆడాడని… ఆయనను భవిష్యత్ తరాలు ఎంతో ఆదరిస్తాయని అన్నారు.
Tag:
kohli
(IND vs SA) ప్రతీ ఆటగాడు మంచి ఫామ్ లో ఉన్నాడు- టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
by Prakash
written by Prakash
భారత క్రికెట్ జట్టు ప్రపంచంలోనే అత్యుత్తమ జట్లలో ఒకటిగా ఉంది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉంది.
ఆదివారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగిన వన్డే మ్యాచ్లో భారత్ దక్షిణాఫ్రికాపై 243 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో అతను సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు.
అయితే, కోహ్లీ సెంచరీ కంటే రోహిత్ శర్మ చేసిన 40 పరుగులే కీలక పాత్ర పోషించాయి. ఒకరకంగా చెప్పాలంటే కోహ్లీ సెంచరీని అధిగమించేలా ఉంది రోహిత్ స్వల్ప ఇన్నింగ్స్.
ఈ విజయంతో భారత్ వన్డే ప్రపంచ కప్లో అజేయంగా వరుసగా ఎనిమిదో మ్యాచ్లో గెలిచింది.
ఈ విజయంతో భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
భారత క్రికెట్ జట్టు ఈ విజయాన్ని కొనసాగిస్తూ ప్రపంచ కప్ను గెలుచుకోవాలని ఆశిద్దాం.




Total views : 78946