అమరావతి….
నేడు జనసేన,టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సమావేశం జరగనుంది, నేటి మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న సమావేశం లో టీడీపీ నుంచి ముగ్గురు,జనసేన నుంచి ముగ్గురు సభ్యులు పాల్గొననున్నారు. టీడీపీ నుంచి కమిటీలో సభ్యులుగా యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, పట్టాభి మరియు జనసేన నుంచి కమిటీలు సభ్యులుగా నాదెండ్ల మనోహర్ ముత్తా శశిధర్, శరత్ కుమార్ హాజరుకానున్నారు.
నేటి మధ్యాహ్నం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనున్నది. ఇప్పటికే ఆరు అంశాలను మినీ మేనిఫెస్టో గా విడుదల చేసిన టీడీపీ, మరో ఐదు లేక నాలుగు అంశాలను చేర్చాలని జనసేన వెల్లడి. ఇరువురి ప్రతిపాదనలతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం..
Tag:
Lokesh
పవన్-లోకేష్ సమావేశాన్ని తేలికగా కొట్టి పారేసింది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అసలు రెండు తెలుగు రాష్ట్రాలకు అసలైన తెగులు తెలుగుదేశం పార్టీయే అన్నారు ఆ పార్టీ నేత, మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాటలు అశ్చర్యకరమైనవేమీ కావన్నారు. చంద్రబాబుకు బీటీమ్ లాంటి పవన్ కొత్త ప్యాకేజీ మాట్లాడుకున్నారని తెలిపారు. వారి మధ్య సాగిన చర్చ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదని, తెలుగుదేశం పరిరక్షణ కోసమే వారి చర్చలు అంటూ విమర్శలు గుప్పించారు.
Older Posts