754
అమరావతి….
నేడు జనసేన,టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సమావేశం జరగనుంది, నేటి మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న సమావేశం లో టీడీపీ నుంచి ముగ్గురు,జనసేన నుంచి ముగ్గురు సభ్యులు పాల్గొననున్నారు. టీడీపీ నుంచి కమిటీలో సభ్యులుగా యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, పట్టాభి మరియు జనసేన నుంచి కమిటీలు సభ్యులుగా నాదెండ్ల మనోహర్ ముత్తా శశిధర్, శరత్ కుమార్ హాజరుకానున్నారు.
నేటి మధ్యాహ్నం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనున్నది. ఇప్పటికే ఆరు అంశాలను మినీ మేనిఫెస్టో గా విడుదల చేసిన టీడీపీ, మరో ఐదు లేక నాలుగు అంశాలను చేర్చాలని జనసేన వెల్లడి. ఇరువురి ప్రతిపాదనలతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం..