జూనియర్ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును ఆదివారం నాటికి దర్యాఫ్తు చేయాలని, లేదంటే సీబీఐకి అప్పగిస్తామని పోలీసులకు అల్టిమేటం జారీ చేశారు. ఈ కేసును పోలీసులు వారం రోజుల్లో పరిష్కరించాలన్నారు. లేదంటే సీబీఐకి అప్పగిస్తామన్నారు. ఈ ఘటనపై ప్రతిపక్ష బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో పోలీసులకు ఆమె డెడ్ లైన్ విధించారు.
మమతా బెనర్జీ మృతురాలి ఇంటికి వెళ్లి, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ఈ కేసులో మరింతమంది నిందితులు ఉంటే ఆదివారంలోగా అరెస్ట్ చేస్తామన్నారు. అప్పటి లోగా రాష్ట్ర పోలీసులు కేసును ఛేదించకుంటే కేంద్ర దర్యాఫ్తు సంస్థకు అప్పగిస్తామన్నారు. ఈ కేసుపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరగాలని కోరుకుంటున్నామన్నారు. ఇదే సమయంలో ఆమె సీబీఐ, ఈడీలపై విమర్శలు చేశారు. సీబీఐ విజయాల రేటు తక్కువగా ఉందన్నారు. చోరీకి గురైన రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ బహుమతి కేసును వాళ్లు ఇంకా పరిష్కరించలేదన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- భూగర్భ సంపద దోపిడీ.ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.భూగర్భంలో లభించే విలువైన ఖనిజ సంపద అక్రమార్కుల పాలవుతోందా..? ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయం కొందరి జేబుల్లోకి వెళ్తోందా..? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వైట్ క్వార్జ్ పేరుతో జరుగుతున్న అక్రమ తవ్వకాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అనుమతులు లేకుండానే తెల్లరాయిని…
- ఏసీబీకి చిక్కిన డిప్యూటీ డైరెక్టర్ నరహరి.లంచం ఇస్తేనే పని జరుగుతుందనే స్థాయి నుంచి… లంచాల కోసమే పథకాలను సృష్టించే స్థాయికి కొందరు అధికారులు దిగజారిపోయారు. తాజాగా ఏసీబీకి చిక్కిన డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఉదంతం దీనికి నిలువెత్తు నిదర్శనం. ఏసీబీ చర్యను స్వాగతిస్తున్నప్పటికీ… సామాన్య ప్రజల నుంచి…
- ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు అందించారు. గుర్తింపు సంఘాల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు పూర్తయిన సందర్భంగా ఆర్టీసీ పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై మంత్రి…
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లెస్ కేబినెట్ సమావేశాల నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు డిజిటల్ కేబినెట్ సమావేశాల సన్నాహకాల్లో…
- తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అరిగిరివారిపల్లిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఏకైక ఉపాధ్యాయుడు సెలవుపై వెళ్లడంతో ప్రత్యామ్నాయంగా మరో టీచర్ను నియమించకపోవడంపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు.ప్రస్తుతం పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఏకైక ఉపాధ్యాయుడు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 148952