Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home National రైళ్లలో ప్రయాణికుల భద్రత, ఛార్జీల పై డిమాండ్..!

రైళ్లలో ప్రయాణికుల భద్రత, ఛార్జీల పై డిమాండ్..!

by Satya
Mamata Banerjee

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రైళ్లలో ప్రయాణికుల భద్రతపై మరింత శ్రద్ధ వహించాలని, టిక్కెట్ల డైనమిక్ల ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రయాణికుల భద్రతకు కేంద్రం ప్రాధాన్యత ఇవ్వాలని, కొన్నిసార్లు రైలు ఛార్జీలు విమానా టికెట్ల కంటే ఎక్కువగా ఉంటున్నాయని విమర్శించారు. గత కొంతకాలం నుంచి రైళ్లలో ప్రయాణించే వారికి టికెట్ ఛార్జీల భారం పెరుగుతోందని, సువిధ రైళ్లలో కొన్ని సందర్భాల్లో విమాన టికెట్ కంటే ఎక్కువ ఉండటం విచారకరన్నారు. అంతంత ఛార్జీలు ఉంటే అత్యవసర సమయాల్లో సామాన్యులు రైళ్లలో ఎలా ప్రయణించగలదరని ప్రశ్నించారు.
‘ఛార్జీల పెంపును అరికట్టాలి, భద్రతా సమస్యలపై శ్రద్ధ పెట్టాలని, అలాగే, దేశంలో పెరుగుతున్న రైలు ప్రమాదాల సంఖ్య గురించిన ప్రస్తావించిన మమతా బెనర్జీ, తాను రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన ప్రమాదాల నిరోధక పరికరాలు, ఇతర చర్యలను ఎందుకు ఉపయోగించడంలేదని ప్రశ్నించారు. ప్రజలకు భారమయ్యే ఛార్జీలను అదుపు చేయకుండా, పెరుగుతున్న రైలు ప్రమాదాలను నివారించడానికి ఎందుకు ప్రయత్నం చేయడంలేదని సందేహం వ్యక్తం చేశారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

026698
Total views : 150901

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.