చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం లోని గుడిపల్లి మండలం యామగానిపల్లి పంచాయతీలో దారుణం… వామనమూర్తి (42) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు రాయితో తలపై కొట్టి దారుణంగా చంపేశారు. యామగానిపల్లి సమీపంలోని పెద్దవంక సమీపంలో ఘటన చోటుచేసుకుంది. క్వారీలో టిప్పర్ లోడింగ్ విషయంలో తలెత్తిన తగాదా అని సమాచారం. గుడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tag:
man brutally murdered
మేడ్చల్ జిల్లా పోచారం ఐ టి కార్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నోజిగూడ, లక్ష్మి నర్సింహా స్వామి కాలనీలో నివసిస్తున్న దారావత్ కరణ్ నాయక్, తండ్రి లక్ష్మణ్, వయస్సు 18… అదే కాలనీకీ సంబందించిన కొందరు దుండగులు కలసి కరణ్ ను అతి దారుణంగా అత్య చేయడం జరిగింది. రంగంలో దిగిన పోలీస్ లు దుండగులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి, కరణ్ మృత దేహాన్ని, గాంధీ హాస్పిటల్ కీ తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య ప్రేమ వివాహానికి సంబంధించింది అని తెలుస్తోంది పోలీసుల అదుపులో 9 మంది, మరికొందరి కోసం గాలింపు, ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Read Also..




Total views : 79529