మందమర్రి పట్టణంలోని వివేకానంద కాలేజ్ ఆఫ్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సిద్దయ్య ఇంటి ఆవరణలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ…., వివేకానంద కాలేజ్ ఆఫ్ పాలిటెక్నిక్ కళాశాల మూడు నెలలుగా టీచర్ లు బోధించడం లేదని పాలిటెక్నిక్ కళాశాల ఆర్థికంగా నష్టపోయి మూసివేస్తున్నట్టు యాజమాన్యం తెలపడంతో ఫీజులు చెల్లించి పరీక్షలు రాయలేని పరిస్థితిలో ఉన్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్, విద్యాధికారులను కలుసుకొని సమస్యను ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించడం లేదని తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాల యాజమాన్యంతో మాట్లాడడానికి తల్లిదండ్రులతో సంప్రదించడానికి ప్రయత్నిస్తే కలవడం లేదని, కనీసం ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యాపకులను మిగిలిన సిలబస్ పూర్తి చేయాలని కోరితే, మూడు నెలలుగా మాకు జీతాలు రావడంలేదని మా జీతాలు చెల్లిస్తేనే కదా విద్యార్థులకు మీకు పాఠాలు బోధిస్తామని హెచ్చరిస్తున్నారని బాధపడ్డారు. ఏప్రిల్ లో సెమిస్టర్ ఎగ్జామ్స్ కు సిద్ధమైనప్పటికీ కళాశాల మూసివేతతో దిక్కుతోచని పరిస్థితుల్లో విద్యార్థినీ విద్యార్థులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
manchiryala district news
రామగుండం పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంచిర్యాల జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధి ఆస్నాద్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై మెరుపు దాడి చేశారు. పదిమంది జూదగాళ్లను అరెస్టు చేసి, వారి నుంచి 14 లక్షల 48 వేల నగదును, పది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ మాట్లాడుతూ గత కొంతకాలం నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన జూదరులు ఒక ముఠాగా ఏర్పడి పెద్ద ఎత్తున పేకాట నిర్వహిస్తున్నారు. గోవాలో జరిగే క్యాసినో మాదిరిగా చిప్స్ లు , కమిషన్లు, లక్షల పెట్టుబడులతో భారీ స్థాయిలో పేకాట నిర్వహిస్తున్నారని అన్నారు. గత కొంతకాలం నుంచి మహారాష్ట్ర సరిహద్దుల్లో పేకాట నిర్వహిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా వీరికి స్థావరాలకు సెక్యూరిటీగా సెంట్రీలను ఏర్పాటు చేసుకొని పేకాట నిర్వహిస్తున్నట్లు సీపీ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే ఎలాంటి వ్యక్తులనైనా వదిలేది లేదని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ రోజు మందమరి మంజునాథ్ గార్డెన్ లోజరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ముఖ్య అతిథులు మాజీ ఎమ్మెల్యే నల్లల ఓదేలు జిల్లా పరిషత్తు చేర్మన్ నల్లల భాగ్య లక్ష్మి మందమర్రి అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు రాయలింగు ఉపులేటి నరేష్, మరియు సఖి లయన్స్ క్లబ్ మహిళ నాయకురాలు శాంకరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అమ్మను పూజించు, భార్యను ప్రేమించు, సోదరుని దీవించు, ముఖ్యంగా స్త్రీని గౌరవించు, ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజలందుకుంటారు, ఎక్కడ స్త్రీలు గౌర వించబడరో అక్కడ ఎంత గొప్ప సత్కార్యాలైనను ఫలించవు అని మన సంస్కృతి తెలుపుతుంది. కనుక నేటి సమాజంలో మహిళల పట్ల వివక్షను ఎదుర్కోవాలంటే మహిళలు తమ తమ రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలని అన్నారు.
అలాగే ఉద్యోగుల గా భార్యా పిల్లలకె కాకుండా చుట్టుపక్కల మన గ్రామాల మహిళలు పని కి వెళ్తారు అన్నారు. 24 మంది అన్నిరంగాల మహిళలను సత్కరించటం సన్మానించి అవార్డు అందజేశారు ప్రోత్సహించడంలోమందమర్రి అంబేద్కర్ యువజన సంఘం, సఖి లయన్ క్లబ్ మంచిర్యాల ఎప్పుడు ముందుంటుందని ఉపులేటి నరేశ్ అన్నారు. అనంతరం మహిళా దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించుకున్న వివిధ రంగాల్లో ఉన్న మహిళలకు మెమోంటో ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళలు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క అరెస్ట్ కు వ్యతిరేకంగా రాజీవ్ రహదారిని నిర్బంధించిన BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు.
నరేంద్ర మోడీ (Narendra Modi) దిష్టిబొమ్మ దహనం.
మంచిర్యాల జిల్లా రామకృష్ణాపుర్ క్యాతన్ పల్లి మున్సిపాలిటీ లోని జాతీయ రహదారిపై ధర్నా అనంతరం మోడీ దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… తెలంగాణ జాతిపిత మన బాపు తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్క ని దుర్మార్గంగా నీచాతి నీచంగా ఇంటి సోదా పేరుతో వచ్చి అరెస్టు చేయడం ఒక పిరికిపంద చర్యగా యావత్ తెలంగాణ ప్రజలు భావిస్తారు అన్నారు. బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరియు యావత్ తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఒకటై బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేద్దామని నీచమైన ఆలోచనతోనే ఇలాంటి ఒక తప్పుడు కేసులో ఇరికించి అరెస్ట్ చేశారని అందరికీ తెలుసు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కవితక్కని వెంటనే విడుదల చేసి సాక్షాలు ఏమైనా ఉంటే న్యాయపరంగా కొట్లాడాలని సవాల్ చేస్తున్నాం. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ మార్పు మార్పు అని తప్పుడు వాగ్దానాలు చేసి అబ్బాధపు మాటలతో తెలంగాణ ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పచ్చగా, సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణని ఈరోజు ఆత్మహత్యల తెలంగాణగా మార్చారన్న విషయాన్ని యావత్ తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు.
ఇటు రైతన్నలు, అటు ఆటో డ్రైవర్ అన్నలు మరియు విద్యార్థులు కాంగ్రెస్ పార్టీకి ఏం పాపం చేశారని అడుగుతానాం? నిర్దాక్షంగా వీరందరిని ఆత్మహత్యలు చేసుకోవడానికి మీరు మీ తప్పుడు వాగ్దానాలు కారణం కాదా అని కాంగ్రెస్ పార్టీ నీ ప్రశ్నిస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, గొప్పగా ఆలోచించే వ్యక్తులు మీ యొక్క తప్పుడు వాగ్దానాలని నమ్మి ఓటు వేసి మోసపోయిన విషయాన్ని ముచ్చటగా మూడు నెలల్లోనే తెలుసుకోవడం నిజంగా తెలంగాణ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాము ఖచ్చితంగా త్వరలోనే మీకు చెంప చెల్లు అనేటట్టు బుద్ధి చెప్తారని మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అయినటువంటి బాపు కేసీఆర్ ని బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారని భావిస్తాను.
ఇది చదవండి : ఎమ్మెల్సీ కవిత భర్తతో పాటు మరో ముగ్గురికి ఈడీ నోటీసులు
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అధిక మొత్తంలో సీట్లు వస్తాయి అని గమనించి బిజెపి కాంగ్రెస్ రెండు పార్టీలు ఏకమై ప్రజల్ని భయపెట్టి ఓట్లు దండుకుందామని ఆలోచనతోనే ఈ రోజు కవితక్క నీ అరెస్ట్ చేశారు. కానీ తెలంగాణ ప్రజలు భయపడరని ఆ రోజు కేసీఆర్ వెంట ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మేము ఈ రోజు కూడా అదే కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి కచ్చితంగా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అత్యధికంగా సీట్లు గెలిపించుకొని ప్రజలందరికీ ధైర్యాన్ని నమ్మకాన్ని నింపి ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కవితక్కని వెంటనే విడుదల చేసి న్యాయంగా కోర్టు ద్వారా తేల్చుకోవాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరపున మేమందరం డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజా రమేష్, టౌన్ ఇంచార్జ్ గాండ్ల సమ్మన్న, కేతనపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్, సోషల్ మీడియా ప్రతినిధులు, బీఆర్ఎస్ యూత్ నాయకులు, మహిళ నాయకులు ఉద్యమ నాయకులు రాముడి కుమార్, జాడి శ్రీనివాస్, పోగుల మల్లయ్య,రేవెల్లి ఓదేలు, జిలకర మహేష్, గడ్డం సంపత్, గడ్డం రాజు, బొద్దుల ప్రేమ్ సాగర్, పారుపల్లి తిరుపతి, అనిల్ రావు, పాల్గొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
Gandhari Qilla Maisamma Jatara :
మందమర్రి మండలం బొక్కల గుట్ట లో గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర గత మూడు రోజులుగా ఆదివాసీ నాయక్ పొడ్లు, రోడ్డ వంశస్థులు గిరిజన సంప్రదాయ పద్దతులలో ఘనంగా నిర్వహించారు. జాతర చివరి రోజున చెన్నూరు ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, క్యాతనపల్లి చైర్ పర్సన్ జంగం కళలు గాంధారి ఖిల్లా మైసమ్మ తల్లి జాతర లో పాల్గొన్నారు. చెన్నూరు ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి కాల భైరవుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
జీడికోట లో ఏర్పాటు చేసిన దర్బార్ లో చెన్నూరు ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి తోపాటుగా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఆదివాసీ నాయక్ పొడు కుల పెద్దలు పాల్గొన్నారు. ప్రజా దర్బార్ లో ఆదివాసీ నాయక్ పోడ్ లో ఆదివాసీ ల ఆరాధ్య దైవం గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరలో సౌలత్ లు లేకా భక్తులు ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఎమ్మేల్యే స్పందించి
గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర కు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కారం కింద త్రాగునీరు,విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తాననీ ఆదివాసీలకు హామీ ఇచ్చారు. అలాగే గాంధారి ఖిల్లాను టూరిజం స్పాట్ గా ఏర్పాటు చేసేందుకు సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకేళ్లుతాననీ భరోసానిచ్చారు.
ఆసియా లొనే అతి పెద్ద జాతర వరంగల్ జిల్లా మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు షెల్టర్ తో పాటు బస్సులను జెండా ఊపి ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామీ…. మంచిర్యాల జిల్లా మందమర్రి బస్టాండ్ నుండి 55 బస్సులను మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం TSRTC ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ లో బస్సు షెల్టర్ బస్సులను డిపో మేనేజర్ తో కలిసి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి మేడారం జాతర ప్రత్యేక బస్సులకు రిబ్బన్ కట్ చేసి, జెండా ఊపి ప్రారంభించి, స్వయంగా వారే బస్సులను నడిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసి డిపో మేనేజర్, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ లు పోలీస్ బందోబస్తు మరియు ఉన్నతాధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ పట్టణ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రయాణికులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా లోని మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీ లలో చైర్మెన్, వైస్ చైర్మన్ ల ఎంపిక సమావేశం అయా మున్సిపాలిటీ సమావేశ మందిరంలో నిర్వహించారు. గత నెల లో రెండు మున్సిపాలిటీ ల్లో కాంగ్రెస్ కౌన్సిలర్ లు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టగా అవిశ్వాసం నెగ్గడం తో చైర్మెన్, వైస్ చైర్మన్ లు పదవులు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మంచిర్యాల నస్పూర్ మున్సిపాలిటీల్లో ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో మంచిర్యాల మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నికకు సంబంధించి 11 గంటలకు ఆర్డిఓ రాములు ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేయగా క్యాంపు నుంచి నేరుగా సమావేశ మందిరానికి కౌన్సిలర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో చైర్మన్ గా రావుల ఉప్పలయ్య, వైస్ చైర్మన్ గా సల్ల మహేష్ లను బలపరచగా 26 మంది సభ్యుల మెజారిటీ మద్దతుతో చైర్మెన్, వైస్ చైర్మన్ లను ఎన్నుకున్నారు. నస్పూర్ మున్సిపాలిటీ లో చైర్మెన్ గా సురిమిళ్ళ వేణు, వైస్ ఛైర్మెన్ గా గెల్లు రజిత లను ఎన్నుకున్నారు. అనంతరం ప్రిసైడింగ్ అధికారి రాములు చైర్మెన్, వైస్ చైర్మన్ ల చే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన చైర్మెన్ ఉప్పలయ్య మాట్లాడుతూ చైర్మెన్ గా ఎన్నుకున్న కౌన్సిలర్ లకు, వెన్నంటే ఉండి పోత్సహించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ కేవలం ఏడాది సమయం పదవీకాలం ఉండడం తో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మరియు పార్టీ నాయకత్వం ఆశయాల మేరకు అధికారులు, తోటి కౌన్సిలర్ల సహకారం తో మున్సిపాలిటీ ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ఉంచేందుకు కృషి చేస్తానని తెలిపారు. మంచిర్యాల మున్సిపాలిటీ వద్ద కాంగ్రెస్ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం నుంచి ఎమ్మెల్యే నివాస గృహానికి కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు.






Total views : 147585