municipal workers
ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీ మహిళలను ఏడిపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తులో ఏడుపే మిగులుతుందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి అన్నారు. కార్మిక సంఘాల రాష్ట్ర పిలుపులో భాగంగా సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియుల ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో మంగళవారం నాడు పెద్ద ఎత్తున జైలు భరో కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలో సమ్మెలో ఉన్న అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైలు భరో కార్యక్రమం మంగళవారం నాటి ఉదయం తిరుపతి నగరంలో జరిగింది. పాత మున్సిపల్ కార్యాలయం నుండి సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు కార్యకర్తలు, నాయకులతో పాటు అంగన్వాడీలు, ఎస్ఎస్ఏ లు పెద్ద సంఖ్యలో ప్రదర్శన చేపట్టారు. ప్రదర్శన నాలుగు కాళ్ల మండపం వద్దకు చేరుకునేటప్పటికీ పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ప్రదర్శనను నిలిపివేయాలని ముందుకు వెళ్లడానికి వీలులేదని ఆంక్షలు పెట్టారు. దీంతో అంగన్వాడీలు, కార్మిక సంఘాల నేతలు నాలుగు కాళ్ల మండపం వద్ద బైఠాయించారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఉండటంతో మగ పోలీసులతో అరెస్టు చేయటానికి పోలీసులు సంకోచిస్తూ తటపటాయించారు. ముందుకు పోనివ్వకుండా అరెస్టులు చేయకుండా నడిరోడ్డుపై కూర్చోబెట్టడాన్ని సహించలేని కార్మిక సంఘాల నేతలు తాము ప్రదర్శనని చేపడుతున్నామని ప్రకటించి ముందుకెళ్లారు. తూర్పు పోలీస్ స్టేషన్ డిఎస్పీ అందరినీ అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించడంతో పోలీసుల నడుమ భారీ సంఖ్యలో అంగన్వాడీలను తూర్పు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్టియుల నేతలు కందారపు మురళి, కె. రాధాకృష్ణ, ఆర్. హరికృష్ణలు ప్రసంగిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. 29 రోజులుగా సమ్మె సాగిస్తుంటే కనీసం సమస్యల పరిష్కారానికి చర్చించకపోగా ఎస్మాను ప్రయోగించి అంగన్వాడీ మహిళలను అపహాస్యం పాలు చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడటం ఆనవాయితీగా మారిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. తక్షణం కార్మిక సమస్యలు పరిష్కారం చేయకుంటే ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించడం ఖాయమని నేతలు హెచ్చరించారు. తూర్పు పోలీస్ స్టేషన్ అంగన్వాడీ మహిళలతో నిండిపోయింది.ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు అంగన్వాడీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించకుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
2019 ముందు జగన్ మోహన్ రెడ్డి అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసాడని బోండా ఉమా అన్నారు. లక్ష పది వేల మంది అంగన్వాడీ ఉద్యోగులు రోడ్డున పడ్డారని ఆయన అన్నారు. జగన్ ఇచ్చిన హామీలు నిరవేర్చకుండా వాళ్ళ మీద ఎస్మా ప్రయోగం అమలు చేస్తున్నాడని అన్నారు. అలాగే ఈ రోజు మున్సిపల్ కార్మికులు నిరసన వల్ల విజయవాడ అంతా కంపు కొడుతా ఉందని అన్నారు. ఈ రోజు ఈ చిరు ఉద్యోగుల మీద నువ్వు ఎందుకు ఇంత కూరాత్మకంగా వ్యవహరిస్తున్నావని ఆయన జగన్ ను ప్రశ్నించారు. అంగన్వాడీ ఉద్యో్గులు ఉద్యోగాలకి వెళ్లకపోవడం వల్ల గర్భిణీలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మున్సిపల్ కార్మికులు ఉద్యోగాలకు వెళ్ళాక పోవడం వలన సుమారు రోజుకు 600 టన్నుల చెత్త రోడ్డు ల పడి ఉన్నాడని అన్నారు. ఈ చలికాలం లో చెత్త పేరుకు పోవటం వలన దోమల బెడద ఎక్కువై ప్రజలు అనారోగ్యానికి గురై ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. హాస్పిటల్స్ లో ప్రజలు జాయిన్ అవుతుంటుంటే ఆరోగ్య శ్రీ పనిచేయడం లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ ఉద్యోగులకు, మున్సిపల్ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు తెలియజేస్తుందని అన్నారు. అన్ని నిత్యా అవసర సరుకుల ధరలు పెంచావు ఈ ప్రభుత్వం లో ప్రజలు ఎంతో నరకం అనుభవించారని అన్నారు. ఈ ప్రభుత్వం తో ప్రజలు విసిగి పోయారు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉందని గుర్తు చేసారు. ఆ రోజు నువ్వు అధికారంలోకి రావడం కోసమే జనాలకు అమలు కానీ హామీలు ఇచ్చావని ఆయన అన్నారు.
పల్నాడు జిల్లా, దాచేపల్లి ఆర్ అండ్ బి బంగ్లా సెంటర్లో మున్సిపల్ కార్మికులకు పోలీసులకు మధ్య వివాదం నెలకొంది. మున్సిపల్ కార్మికులు సమ్మెలో భాగంగా కార్మికులు రోజు సమ్మె చేస్తున్న తరుణంలో ఈరోజు మున్సిపల్ శాఖ అధికారులు వేరే వారి ద్వారా పారిశుద్ధ పనులు చేయించాలని చూడటంతో వారిని అడ్డుకున్న కార్మికులు. రంగ ప్రవేశం చేసిన దాచేపల్లి పోలీసులు. కార్మికులకు పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బలవంతంగా స్టేషన్ కు తరలించేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు, ట్రాక్టర్ ముందు బైఠాయించి నిరసన తెలియజేస్తున్న కార్మికులు.