వేమూరు మండలం జంపని గ్రామంలో క్రిస్టియన్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన సెమి క్రిస్మస్ వేడుకలలో మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, పెదలకు దుప్పట్లు పంపిణి చేశారు. క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. నక్కా ఆనంద బాబు మాట్లాడుతూ.. నీ వలే నీ పొరుగువారిని ప్రేమించుము శత్రువును కూడా ప్రేమించాలి అని బైబిల్ చెపుతోంది అన్నారు. కానీ మిత్రుడిని కూడా శత్రువుగా చూసే పరిస్థితి నేడు ఉంది అని వివరించారు. మానవ ప్రయత్నానికి.. దేవుని అశీస్సులు కావాలి, అప్పుడే సంకల్పం నెరవేరుతుందని తెలిపారు. సమస్త మానవాళి రక్షణ కోసం దేవుడు ఏసు మానవ రూపంలో వచ్చారని, రాష్ట్రానికి మంచి జరగాలి అని చర్చిల్లో ప్రార్థనలు చేయండి అని విజ్ఞప్తి చేశారు.
Nakka Anand Babu
సిఎం జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా తరిమి కొట్టడానికి ప్రజాగళాన్ని నిర్వహించబోతున్నామని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు. పార్వతీపురం పట్టణంలో టిడిపి ఇన్ ఛార్జ్ బోనాల విజయచంద్ర నివాసంలో నక్కా మీడియాతో మాట్లాడారు. యువగళం పాదయాత్రలో పార్వతీపురం నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. లోకేష్ యువగళం పాదయాత్ర ఆపేందుకు ఎన్నో అడ్డంకులు సృష్టించారని విమర్శించారు. రెండు నెలలు పాదయాత్రను ఆపగలిగారు కానీ ప్రజల్లో ఉన్న స్పందనను మాత్రం ఆపలేకపోయారని ఆరోపించారు. చంద్రబాబునాయుడు పై అక్రమ కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఆత్మసంతృప్తి పొందారని విమర్శించారు. ఎన్నికలు త్వరలో వస్తున్నందున ఇచ్చాపురం వరకు సాగవలసిన పాదయాత్రను విశాఖపట్నంలోనే ముగిస్తున్నామని నక్కా ఆనంద్ బాబు తెలిపారు. అనంతరం అంగన్వాడీలు చేస్తున్న ధర్నాకు మద్ధతుగా దీక్షా శిబిరం వద్దకు వెళ్లి నక్కా ఆనంద్ బాబు సంఘీభావం తెలిపారు.