సింగరేణి ఇల్లందు క్లబ్ లో నూతన సంవత్సరం 2024 వేడుకలు మంచిర్యాల జిల్లా మందమర్రి, సింగరేణి అధికారులు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న ఏరియా జియం A. మనోహర్ సవిత పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. ముందుగా సింగరేణి కార్మికులకు, అధికారులకు, ఉన్నతాధికారులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి నృత్యాలు చేస్తూ ఆనంద ఉత్సాహాల మధ్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. డిసెంబర్ 31 గతంలోని బాధలను మరచిపోయి, కొత్త సంవత్సరంలో వాటి గురించి ఆలోచించకుండా మనస్ఫూర్తిగా దృఢ సంకల్పంతో మన జీవితాలను, కాపాడుకోవాలి, మనం మంచి అలవాట్లను మరియు మన నూతన విజయాన్ని పునరుద్ధరించుకుందాం. గత సంవత్సరం నిరాశాజనకంగా చెడుగా ఉంటే, కొత్త సంవత్సరం ఆశాజనకంగా క్రొత్తగా ఉండాలని కోనియాడారు.
new year celebrations
తిరుపతి జిల్లాలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సాంస్కృతికంగా కించపరిచేలా అశ్లీల నృత్య కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వబోమని, కొత్త సంవత్సరం సందర్భంగా బైక్లు, కార్లను రేసింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పి పరమేశ్వర రెడ్డి హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి 31-12-2023/01-01-2024 రాత్రి సమయంలో హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, ప్రైవేట్ స్థలాలు, క్లబ్లు మరియు పబ్ల నిర్వాహకులకు జిల్లా యస్.పి పి.పరమేశ్వర రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ చట్టం-2013 ప్రకారం మార్గదర్శకాలులను జారీ చేశారు. కొత్త ఆంగ్ల సంవత్సరం రోజు (అర్ధరాత్రి) 1.00 AM వరకు ఈవెంట్లు/ కార్యక్రమాలు నిర్వహించబోవు హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, ప్రైవేట్ స్థలాలు, క్లబ్లు మరియు పబ్ల నిర్వాహకులు ముందుగానే అనుమతి మంజూరు కోసం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు తిరుపతి జిల్లా, కి దరఖాస్తు చేసుకోవాలి. అనుమతి తీసుకోని యెడల చట్టరీత్యా చర్యలు తీసుకోనబడును. ఈవెంట్ నిర్వాహకులు బయటకు/ లోపలికి వచ్చే మార్గాలలో మరియు పార్కింగ్ ప్రాంతాలలో ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. నిర్వాహకులు & మేనేజ్మెంట్ వారు బాధ్యతగా వారు నిర్వహించబోవు కార్యక్రమాల వద్ద భద్రత అదుపులో ఉండేందుకు తగు సిబ్బందిని వారే నియమించుకోవాలి. కార్యక్రమంలో వేసే దుస్తులు, చేసే నృత్యాలు, మాట్లాడే విధానాలలో ఏటువంటి అశ్లీలత ఉండదని నిర్వాహకులు నిర్ధారించాలి. ఏ ప్రదర్శనలోనూ అశ్లీలత మరియు నగ్నత్వం ఉండకూడదు. నిర్వాహకులు DJ/స్పీకర్స్ యొక్క శబ్దంను 45 డిసిబెల్స్ ను మించరాదు, సదరు విషయాన్ని ముందుగా నిర్ధారించాలి. నిర్వాహకులు & మేనేజ్మెంట్ వారు కార్యక్రమ వేదిక వద్ద ఎటువంటి బాణసంచా పేలుడు పదార్ధాలు అనుమతించరాదు. సదరు విషయాన్ని కస్టమర్లకు ముందుగా హెచ్చరిస్తూ తెలియపరచాలి. వేదిక లోపల నిర్వాహకులు క్రమబద్ధతను నిర్వహిస్తూ ఎటువంటి గందరగోళం లేకుండా ఉంచాలి. ప్రజలు మరియు బార్లలో ప్రత్యేకముగా దంపతుల/ జంటల కోసం నిర్వహించే కార్యక్రమాలలో మైనర్లను అనుమతించకూడదు.
నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా 31 వ తేదీ రాత్రి 8.00 గంటల నుండి జనవరి 01 వ తేదీ ఉదయం వరకు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెం 4 మల్లంపేట్ – శంభీపూర్ ఎగ్జిట్ 5 దుండిగల్ మూసి వేస్తున్నామని బాలానగర్ డివిజన్ ట్రాఫిక్ ఏ.సి.పి శ్రీనివాస్ తెలిపారు. ప్రజలు సామాజిక బాధ్యత వహిస్తే రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా ఉండే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని బాలానగర్ డివిజన్ ట్రాఫిక్ ఏసిపి అన్నారు. శుక్రవారం జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు, వాహనదారులు రోడ్లపైకి వచ్చేటప్పుడు సామాజిక బాధ్యత పాటించాలని అలాగే నూతన సంవత్సర వేడుకల్లో యువత మద్యం సేవించి వాహనాలను నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. ఒక వేళ మద్యం సేవించి, హెల్మెట్ లేకుండా, నియమ నిబంధనలు పాటించకపోతే వాహన దారల పై చట్టపరమైన, న్యాయ పరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఒకరు వాహనాలు అజాగ్రత్త నడిపితే, ఒకరు వల్ల ఇంకొకరి ప్రాణాలకు ముప్పు ఉండవచ్చని అన్నారు. ఓ వ్యక్తి ప్రమాదంలో మృతి చెందితే సదరు వ్యక్తి కుటుంబం రోడ్డుపై పడుతుందని, ఒకరి నిర్లక్ష్యంతో మరొకరు ఇబ్బందుల పాలవుతారని ఎసిపి చెప్పుకొచ్చారు. డిసెంబర్ 31 రోజున 12 బృందాలతో పటిష్ట డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయనున్నట్లు ఎ.సి.పి మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రజలు శాంతియుతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని, మద్యం సేవించి రోడ్లపైకి రావద్దని ఆయన హెచ్చరించారు. అర్ధరాత్రి ఎవరైనా కేకులు కట్ చేసిన, టపాసులు/ బాణసంచా పేల్చిన, బైక్ ర్యాలీ లు చేసిన సి.సి కెమెరా ద్వారా వారిని కనుగొని కేసులు నమోదుచేస్తామని అన్నారు. సమావేశంలో జీడిమెట్ల ట్రాఫిక్ సి.ఐ వెంకట్ రెడ్డి, యస్. ఐ లు ఇతర ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
బాపట్ల పట్టణంలోని విలియం బూత్ జూనియర్ కాలేజీలో బాపట్ల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో 2023 గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ సువార్త ప్రసంగీకులు డాక్టర్ వి రంగరాజు,ప్రముఖ సినీ గాయని ఎం ఎం శ్రీలేఖ, ప్రముఖ సంగీత విధ్వంసుడు జె క్రిస్టోఫర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేగేసిన మాట్లాడుతూ ప్రపంచమంత జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని, ఈ క్రిస్మస్ వేడుకలను గత ఆరు సంవత్సరాల నుంచి బాపట్లలో నేను నిర్వహిస్తున్నానని, ఆ జీసస్ దయవల్ల ఈ కార్యక్రమాన్ని నేను చేయగలుగుతున్నాను అని అన్నారు. జీసస్ దీవెనలు బాపట్ల నియోజకవర్గ ప్రజలందరి మీద ఉండాలని ఆయన ఆ జీసస్ ని వేడుకొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ భారీ కేక్ కట్ చేసి అనంతరం రాజమండ్రి వారి ఆధ్వర్యంలో భారీ బాణాసంచా, క్రాకర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది.





Total views : 78393