నెల్లూరు జిల్లా, ఉదయగిరి బెల్ట్ దుకాణాలపై పోలీసులు దాడులు. ఉదయగిరి పట్టణంలోని గండిపాలెం మార్గం వైపు ఉన్న పెట్రోల్ బంక్ ఎదురుగా అనుమతి లేకుండా బెల్ట్ దుకాణాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 51 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. మద్యం విక్రయిస్తున్న ఇద్దరు మహిళలు కూడా అదుపులో తీసుకున్నారు.
news
కాకినాడ జిల్లా, అంగన్వాడీల పై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రకటించిన మేము భయపడేది లేదు ఆనాడు తమిళనాడు ప్రభుత్వం ఎస్మా ప్రకటించింది ఆ ప్రభుత్వం కనుమరుగయ్యింది. త్వరలో జగన్మోహన్ రెడ్డి అదే పరిస్థితి ఎదుర్కొంటాడు. కాకినాడ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ లు నైట్ కూడా దిక్షలు నిర్వహించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతాం అని ప్రభుత్వానికి అంగన్వాడీ లు హెచ్చరిస్తున్నారు.
భార్యతో కలిసి కన్న తల్లిని హత్య చేసిన దుర్మార్గుడు. బంధువులకు అనుమానం రావడంతో బయటపడిన విషయం. ఆస్తి అమ్మడానికి అడ్డు వస్తుందని కన్నతల్లినే భార్యతో కలిసి మట్టు పెట్టాడు ఓ కిరాతకుడు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ వెంకట్ రెడ్డి నగర్ లో ఆలస్యంగా వెలుగు చూసింది.
వెంకట్ రెడ్డి నగర్ ప్రాంతానికి చెందిన కసావేణి సుగుణమ్మ భర్త కొన్నాళ్ల క్రితం చనిపోయాడు ఆమెకు కుమారుడు అనిల్ ,కోడలు తిరుమల ఉన్నారు
వీరి ఇద్దరు పిల్లలు హాస్టల్లో చదువుకుంటున్నారు, భర్త చనిపోయిన తర్వాత ఇంటిని సుగుణమ్మ తన పేరు మీదకు మార్చుకుంది కొడుకు జులాయి గా తిరగడంతో అప్పులు పెరిగాయి, అప్పులు తీర్చేందుకు ఇల్లు అమ్మాలని కొడుకు, కోడలు కొంతకాలంగా సుగుణమ్మ పై ఒత్తిడి చేస్తున్నారు అయితే సుగుణమ్మ ససేమీరా అనడంతో కోడలుతిరుమల పుట్టింటికి వెళ్ళింది ఇల్లు అమ్మాలంటే ఎలాగైనా తల్లి అడ్డు తొలగించుకోవాలని అనిల్ నిర్ణయించుకున్నాడు ఈ నెల నాలుగవ తేదీ అర్ధరాత్రి తిరుమల మరో వ్యక్తి శివతో కలిసి వెంకటరెడ్డి నగర్ వచ్చింది అదే రాత్రి సుగుణమ్మ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు, అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రలో ఉన్న సుగుణమ్మ ముఖంపై దిండు అదిమి గొంతు చుట్టి హత్య చేశారు అమ్మ నిద్రలోనే చనిపోయిందని అనిల్ బంధువులతో బుకాయించారు. మృతదేహంపై గాయాలు ఉండడంతో బయటపడ్డ అసలు నిజం. మరణ వార్త విని సుగుణమ్మ తల్లి దాసరి ఐలమ్మ సహా బంధువులు వరంగల్ ప్రాంతం నుంచి భారీగా తరలివచ్చారు 5వ తేదీన అంత్యక్రియలకు సన్న హాలు చేశారు సుగుణమ్మ మృతదేహానికి స్నానం చేయిస్తుండగా మెడమీద గాయాలు కనిపించాయి దీంతో అనుమానం వచ్చి బంధువులు అనీలు నిలదీయగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు దీంతో పోలీసులు కొడుకు, కోడలిని అదుపులోకి తీసుకొని విచారించడంతో విషయం బయటపడింది. ఆస్తి కోసం అమ్మను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుని భార్య ఆమెతో వచ్చిన శివతో కలిసి హత్య చేసినట్లు అనిల్ పోలీసులకు తెలిపాడు దీంతో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
నెల్లూరు జిల్లా, గుడ్లూరు (మం) మాచర్ల వద్ద జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం. లారీని ఢీ కొట్టిన TSRTC బస్సు ఒకరు మృతి, 7గురి పరిస్థితి విషమం. మృతి చెందిన వ్యక్తి బస్ డ్రైవర్ వినోద్ గా గుర్తింపు. మిర్యాలగూడ నుండి తిరుపతి వెళ్తున్న TSRTC బస్సు. క్షతగాత్రులను కావలి ఏరియా వైద్యశాల లో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలింపు. ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్న పోలీసులు.
తిరుపతి, ఉమ్మడి నెల్లూరు జిల్లా, గూడూరు జిల్లాలో పలుచోట్ల ఉద్రిక్తత అర్ధరాత్రి మున్సిపల్ కార్మికుల బైటాయింపు. కార్మికులు సమ్మెలో ఉండగా పర్మనెంట్, ప్రైవేట్ కార్మికులతో అర్ధరాత్రి చెత్త తీపిస్తున్న అధికారులు. అడ్డుకున్న మున్సిపల్ పారిశుధ్య ఔట్ సోర్సింగ్ సిబ్బంది. అధికారులు, పోలీసులుతో పారిశుద్ధ్య కార్మికుల వాగ్వాదం. నెల్లూరు నగరంలోనూ ఇదే పరిస్థితి. రోజు రోజుకూ ఉధృతం అవుతున్న కార్మికుల సమ్మె.
రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి ప్రాతఃకాల పూజ నిర్వహించిన ఆలయ అర్చకులు ఉత్సవ మూర్తులను పల్లకి సేవ లో ప్రతిష్టించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. తదుపరి రంగురంగుల పూలతో అలంకరించిన అంబారి సేవపై శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఉత్సవ మూర్తులను ప్రతిష్టించి దేవాలయంలో మూడు ప్రదక్షిణలు చేసిన అనంతరం రాజగోపురం గుండా స్వామివారు బయటకు రాగానే వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ శర్మ, రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పాటు వేలాది భక్తులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ఇంద్ర పాలెం లోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవాలయానికి 500 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వామి వారు స్వయంభు, 18వ తేదీ సోమవారం తెల్లవారుజాము నుంచి సృష్టికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి షష్టికి 40 వేల పైబడి భక్తులు వస్తారని అందుకు తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని ఈవో జోగా సత్యనారాయణ తెలిపారు. స్వయంభు దేవాలయం కావడంతో భక్తులు సంఖ్య ఏటేటా పెరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు దత్తు తెలిపారు. జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తారని ఆయన వెల్లడించారు.
Read Also..
అల్లూరి సీతారామ జిల్లా చింతపల్లి మండలం లంబసింగి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో చాలీచాలని రూములతో ఇబ్బందులు పడుతున్న ఆశ్రమ పాఠశాల విద్యార్థినీలు. ప్రస్తుతం 320 మంది విద్యార్థినిలు ఇరుకైన చిన్న రూములలో చదువుకోవడం మరలా బెంచిలి తీసి పడుకోవడం కొంతమంది విద్యార్థినిలు రూములు చాలక బయట గ్రౌండ్లో నేలపై చదువుకోవడం జరుగుతుంది, గత తెలుగు దేశం ప్రభుత్వం హైములో స్కూల్ బిల్డింగ్ మంజూరు చేసారు అది పునాదిలు తీసి పిల్లరస్ కట్టి వదిలేసారు అక్కడ గోతుల్లో నీరునిల్వ ఉండి పోయి దోమలు విపరీతంగా పెరిగి పోయి రోగాలు బారిన పడి అవకాశం ఉందని ఆ గ్రామ పెద్దలు వద్యార్థి తల్లి తండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నాడు నేడు పనులతో అన్ని స్కూళ్లను రూపుమారుస్తున్నారు కానీ లంబసింగి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలకు ఆ భాగ్యం లేదని ఎన్నోసార్లు ప్రభుత్వ అధికారులకు తెలియపరిచిన వారి విద్యార్థినిలు సమస్య సమస్యలుగా మిగిలిపోయిందని తెలుగుదేశం పార్టీ నాయకుడు కిముడి లక్ష్మయ్య అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థినిలు కనీస అవసరతలు తీర్చాలని విద్యార్థిని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పశ్చిమగోదావరిజిల్లా, తాడేపల్లిగూడెం సీవీఆర్ కెమెరామెన్ ఉర్ల బాలకృష్ణ వర్ధన్ పై దౌర్జన్యానికి దిగి ఐడీ కార్డు లాక్కోవడం విషయంలో తమదే తప్పని యూనియన్ ఆసుపత్రి యాజమాన్యం, యూనియన్ ఆసుపత్రి ఎండీ కళ్యాణ్ అందుబాటులో లేకపోవడం కారణంగా అయన ఫోన్ లో స్పీకర్ ఆన్ చేసి మీడియా ప్రతినిధులకు బహిరంగ క్షమాపణ చెప్పిన వైనం. అయన క్షమాపణ చెప్పడంతో పాటుగా అసుపత్రి వద్ద సిబ్బంది ఎవరైతే కెమెరామెన్ పై దౌర్జన్యం చేసి దుర్బాషలాడారో ప్రతీ ఒక్కరి చేతా క్షమాపణలుచెప్పించిన వైనం. అంతకు ముందు ఆసుపత్రి వద్ద వీడియో తీస్తూ ఉండగా కెమెరామెన్ వర్ధన్ ఐడీ కార్డు లాక్కొని దౌర్జన్యం చేసిన యూనియన్ సిబ్బంది. మూకుమ్మడిగా ఆసుపత్రి సిబ్బంది కెమెరామెన్ పై దౌర్జన్యానికి దిగడమే కాక అక్కడికి వచ్చిన కొందరు రిపోర్టర్లు పైన కూడా దురుసుగా ప్రవర్తించడంతో రేగిన వివాదం. విషయం తెలుసుకున్న మీడియా మిత్రులు పెద్ద ఎత్తున యూనియన్ ఆసుపత్రి వద్దకు చేరుకుని వర్ధన్ కు సంఘీభావం తెలిపి ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగిన వైనం. జిల్లా ఎస్పీ రవి ప్రకాష్, ఆర్డీవో చెన్నయ్య, డీఎం అండ్ హెచ్ వో మహేష్ తదితర జిల్లా అధికారులు దృష్టికి ఆసుపత్రి సిబ్బంది దౌర్జన్యాన్ని తీసుకువెళ్లిన మీడియా మిత్రులు. జిల్లా అధికారులు ఆదేశాలతో హుటాహుటిన ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేస్తున్న మీడియా మిత్రులతో మాట్లాడిన టౌన్ ఎస్సై సురేందర్ రెడ్డి, ఇంచార్జ్ ఎమ్మార్వో శివ శంకర్ తాడేపల్లిగూడెం ఏరియా ప్రెస్ క్లబ్ సభ్యులు ఎపీయూ డబ్ల్యూ జే జిందాబాద్, ప్రెస్ క్లబ్ జిందాబాద్ అని నినాదాలతో హోరెత్తించి ఆందోళన కొనసాగించిన వైనం. అధికారులు సర్దిచెప్పి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని యూనియన్ ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బందితో బహిరంగ క్షమాపణ చెప్పించడంతో సర్థుమణిగిన వివాదం. ఈ ఆందోళనలో పిలుపు ఇవ్వగానే ఆసుపత్రి వద్దకు వచ్చిన పోలీసు, రెవిన్యూ అధికారులు వారికి అదేశాలు ఇచ్చి పంపిన జిల్లా అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన మీడియా మిత్రులు.