నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ అనుముల మండల ఐటిఐ కాలేజ్ లో జిల్లా కలెక్టర్ ఆర్జీవి కర్ణన్ మాట్లాడుతూ 299 పోలింగ్ స్టేషన్లో సిబ్బంది ఈవీఎం ఏర్పాట్లు చేయడం జరిగింది. వెహికల్స్ కూడా రావడం జరిగింది ఆఫ్టర్ లంచ్ తర్వాత పోలింగ్ స్టేషన్ లో వెళ్లడం జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్టర్ అన్ని ఏర్పాట్లు మంచినీళ్లు భోజనం సదుపాయాలు చేయడం జరిగింది. రేపు అతి ముఖ్యమైన రోజు 30 తారీకు పోలింగ్ స్టేషన్లో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. తప్పకుండా ఓటు వేయాలని కోరుకుంటున్నాను.
Polling staff
గురువారం జరగబోయే ఎన్నికల కు అన్ని ఏర్పాట్లు చేశామని రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 638 పోలింగ్ స్టేషన్లో అన్నీ ఏర్పాట్లు చేస్తున్నామని, పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలోనే పబ్లిక్ ను అపి పూర్తిగా చెక్ చేసిన అనంతరం పొలింగ్ కేంద్రంలో కి అనుమతి. 3500 మంది పోలీస్ మరియు 5000 మంది పోలింగ్ సిబ్బందితో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా ఏర్పాట్లు 80 సంవత్సరాల దాటిన వారికి ఇంటి నుండి ఓటేసి సదుపాయం కూడా కల్పించామని, వృద్దులకు, వికలాంగులకు వీల్ చైర్ లు ఏర్పాటు చేసి వాలింటర్లను సిద్ధం చేశామని ఆయన తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జిల్లాలో పకడ్బందిగా నిర్వహించేందుకు, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ ఆదేశించారు. జిల్లాల్లో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ, ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల ఏర్పాటు, ఈ వీఎంయంత్రాల తరలింపు, కౌంటింగ్ ఏర్పాట్లు తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళలు, యువత, దివ్యాంగుల ను పోలింగ్లోభాగస్వామ్యం చేసేలా మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ నిర్వహణకు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని, విధులు నిర్వహించే పోలింగ్ సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లు కల్పించాలని అన్నారు.
పోలీస్ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు సోమవారం వరకు అవకాశం ఉన్నందున వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు. అదే విధంగా జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ సిబ్బంది (పిఓలు, ఎపిఓలు, పిఓపిలు) 23వ తేది వరకు పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 28వ తేది వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉన్నందున సిబ్బంది ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ భారతి హోలీకేరీ తెలిపారు.
Read Also…
Read Also…





Total views : 75406