చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలంలోని పెన్షన్ లబ్ధిదారులకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దేసూరి కండ్రిగ, హరిజనవాడ, రామచంద్రపురం మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఉదయం 6 గంటలకే లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లను పంపిణీ చేసారు ఎమ్మెల్యే పులివర్తి నాని. ఎన్టిఆర్ భరోసా పింఛన్ పంపిణీ దేసూరి కండ్రిగ, హరిజనవాడ, రామచంద్రపురం మండలం లోని ప్రజలు ఎమ్మెల్యే చేతుల మీదుగా పెన్షన్ తీసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. చంద్రగిరి పురంలో పులివర్తి నాని చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ. పార్టీ కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగులు, అధికారులతో కలిసి పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే పులివర్తి నాని. పంపిణీని కేవలం రెండు రోజుల్లోనే నూరుశాతం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ పెన్షన్ పంపిణీ చేస్తున్నామని అన్నారు ఎమ్మెల్యే. ప్రజల వద్దకు ఎమ్మెల్యే వచ్చి పెన్షన్ పంపిణీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు పెన్షన్ దారులు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- 17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు డీఎంఆర్సీ కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 7:30 గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు వెల్లడించింది. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్,…
- నీట్ పేపర్ లీక్పై సుప్రీంకోర్టులో విచారణ.నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణలు, సాధించిన పురోగతిపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రంతో పాటు NTAలను ఆదేశించింది సుప్రీంకోర్టు. కేవలం తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, పరీక్షా వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన…
- నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే… ప్రజలకు అందుతున్న సేవలు,…
- సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో విచిత్ర ఘటన.సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఓ విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా నేరస్తులు, ఖైదీలకు వేయాల్సిన సంకెళ్లను ఏకంగా పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకే వేసిన దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఠాణా ప్రాంగణంలోకి ఇతర వాహనాలు, అనధికార…
- సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష విరమణ.దేశ విద్యావ్యవస్థలో పారదర్శకత, సమగ్ర సంస్కరణల కోసం గత 26 రోజులుగా లడఖ్ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఎట్టకేలకు ముగిసింది. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన కీలక చర్చల అనంతరం ఆయన తన సుదీర్ఘ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి