రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో BJPకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ టికెట్ ఆశించారు,BJP పార్టీ విడుదల చేసిన మూడవ జాబితాలో తన పేరు లేకపోవడం తో మనస్తాపం చెంది నేడు ఒక ఫంక్షన్ హల్ లో అభిమానులు,ఆత్మీయులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంకి భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. పార్టీని నమ్ముకొని నమ్ముకొని కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి తన ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించానని, కానీ రాష్ట్ర పార్టీలోని పెద్దలు తనకు టికెట్ రాకుండా అడ్డుకొని తన సామాజికవర్గంకి చెందిన వ్యక్తికి టికెట్ ఇప్పించుకున్నారని పరోక్షంగా ఈటెల రాజేందర్ ని ఉద్దేశించి అన్నారు. అభిమానుల కోరిక మేరకు రెబెల్ అభ్యర్థిగా బరి ఉంటానని, సేవ కార్యక్రమాలు చెయ్యడం వల్ల నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అభిమానులు ఉన్నారని వాళ్ళ ఆశీస్సులు తనమీద ఉంటాయని విష్ణువర్ధన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు .
Tag:
ranga reddy
ఫైబర్ నెట్ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో కీలకంగా మారిన టెరాసాఫ్ట్ సంస్థ ఆస్తులను అటాచ్ చేసేందుకు నిర్ణయించారు. పోలీసుల నిర్ణయానికి రాష్ట్ర హోం శాఖ అంగీకరించడంతో కోర్టు అనుమతికి దరఖాస్తు చేసుకున్నారు. ఫైబర్ నెట్ టెండర్లను నిబంధనలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్ సంస్థకు కట్టబెట్టినట్టు సీఐడీ కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో, సంస్థకు చెందిన పలు స్థిరాస్తులను అటాచ్ చేయాలని సీఐడీ భావించింది. ఈ మేరకు చేసిన ప్రతిపాదనలకు హోం శాఖ ఆమోదం తెలిపింది. పోలీసులు అటాచ్ చేయదలిచిన ఆస్తుల్లో గుంటూరులోని ఓ ఇంటి స్థలం, విశాఖపట్నంలోకి ఓ ఫ్లాట్, హైదరాబాద్లో నాలుగు ప్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి ఉంది. ఈ ఆస్తుల అటాచ్మెంట్కు అనుమతి కోసం సీఐడీ పోలీసులు విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
Older Posts