ఏపీలో నాసిరకం మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. దశలవారీగా మద్యం నిషేధిస్తామని చెప్పిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మద్యం అమ్మకాలు మొదలుపెట్టి డబ్బును ప్యాలెస్కు తరలిస్తున్నారని విమర్శించారు. మద్యం ధరలు పెంచడమే కాదు నాసిరకం మద్యాన్ని పంపిణీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు. ఇసుక లభించక లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని. దోచుకున్న సొమ్మంతా కక్కిస్తామన్నారు. అర్హతలేని వ్యక్తిని టీటీడీ ఈవోగా నియమించారని విమర్శించారు. సామాజిక న్యాయం అంటే నీ సొంత వర్గానికి న్యాయం చేయటమా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
Tag:
road
డక్కిలి మండలం వెలికల్లు – మార్లగుంట మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం. నారువేత రైతు కూలీలతో వెళ్తున్న రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీ. ప్యాసింజర్ డ్రైవర్ల మృతి..ఇరు ఆటోలలో ప్రయాణిస్తున్న 20 మంది రైతు కూలీలకు తీవ్ర గాయాలు. గాయపడిన 20 మంది రైతు కూలీలను 108 సహాయంతో రాపూరు,గూడూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలింపు. గాయపడిన రైతు కూలీలలో 20 మంది రాపూర్ వాసులుగా ప్రాధమిక గుర్తింపు.






Total views : 78626