ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ స్థానంలో హార్ధిక్ పాండ్యా పేరును ప్రకటించడం క్రికెట్ వర్గాల్లో చర్ఛనీయాంశమైంది. జట్టుని ఏకంగా 5 సార్లు టైటిల్ విజేతగా నిలిపిన హిట్మ్యాన్ని కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. తాజాగా రోహిత్ శర్మ భార్య రితికా కూడా తొలిసారి రియాక్ట్ అయ్యింది. ముంబై కెప్టెన్ మార్పు అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియాలో హృదయపూర్వకంగా స్పందించింది. ఉత్సాహభరితమైన సవాలుకు ఒక ఏడాది! చాలా గౌరవప్రదం రోహిత్!’’ అంటూ రోహిత్కు సానుభూతిగా ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్టు పెట్టింది. ఈ పోస్టుపై పసుపు రంగు హార్ట్ ఎమోజీతో రితికా స్పందించింది. కాగా పసుపు రంగు చెన్నై సూపర్ కింగ్స్కు ఎంతో ప్రత్యేకమైనది. ఆ జట్టు జెర్సీ కూడా అదే రంగులో ఉంటుంది. చెన్నై సొంత మైదానం మొత్తం పసుపుమయంగా కనిపిస్తుందన్న విషయం తెలిసిందే. ఫ్రాంచైజీకి ఆదర్శప్రాయమైన సేవలు అందించిన రోహిత్కు ధన్యవాదాలు అంటూ పేర్కొంది.
Tag:
Rohit Sharma
(IND vs SA) ప్రతీ ఆటగాడు మంచి ఫామ్ లో ఉన్నాడు- టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
by Prakash
written by Prakash
భారత క్రికెట్ జట్టు ప్రపంచంలోనే అత్యుత్తమ జట్లలో ఒకటిగా ఉంది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉంది.
ఆదివారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగిన వన్డే మ్యాచ్లో భారత్ దక్షిణాఫ్రికాపై 243 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో అతను సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు.
అయితే, కోహ్లీ సెంచరీ కంటే రోహిత్ శర్మ చేసిన 40 పరుగులే కీలక పాత్ర పోషించాయి. ఒకరకంగా చెప్పాలంటే కోహ్లీ సెంచరీని అధిగమించేలా ఉంది రోహిత్ స్వల్ప ఇన్నింగ్స్.
ఈ విజయంతో భారత్ వన్డే ప్రపంచ కప్లో అజేయంగా వరుసగా ఎనిమిదో మ్యాచ్లో గెలిచింది.
ఈ విజయంతో భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
భారత క్రికెట్ జట్టు ఈ విజయాన్ని కొనసాగిస్తూ ప్రపంచ కప్ను గెలుచుకోవాలని ఆశిద్దాం.




Total views : 79475