కుళ్లిపోయిన మాంసాహారాన్ని కస్టమర్లకు వడ్డిస్తూ వారి ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతోంది విశాఖలోని కామత్ హోటల్. విశాఖ బీచ్ రోడ్డులోని కామత్ హోటల్ లో ప్రతిరోజూ మిగిలిపోయిన మాంసాహారన్ని అలాగే రోజుల తరబడి నిల్వ చేస్తున్నారు. కాసుల కక్కుర్తితో తిరిగి అదే మాంసాహారాన్ని కుళ్లిపోయాక కూడా కస్టమర్లకు వడ్డిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సాంప్రదాయ రుచులను ఆస్వాదించండి అని కస్టమర్లను ఆకర్షిస్తూ వారి ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. నిర్వాహకుల నిర్వాకంతో కామత్ హోటల్ పేరు చెబితేనే కస్టమర్లు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని కస్టమర్లు వాపోతున్నారు. అయితే సీ.ఆర్.జడ్. నిబంధనలకు తూట్లు పొడుస్తూ కామత్ హోటల్ ను అక్రమంగా నిర్మించగా గతంలోనే జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. అయినా మళ్లీ ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వాహకులు అక్రమంగా హోటల్ ను నడుపుతున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కోహ్లీ, శ్రేయస్ పోరాటం వృథా.. ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి.ఇంగ్లండ్ అద్భుతంగా పుంజుకుని నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను 1-1తో సమం చేసింది. ఈ విజయానికి పునాది వారి పేస్ బౌలర్లు వేశారు. ముందుగా భారత జట్టును కేవలం 233 పరుగులకే ఆలౌట్ చేశారు.…
- నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో భేటీ కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాభావ పరిస్థితులు, సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి,…
- అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో హైకోర్టు సంచలన తీర్పు.అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గత వైసీపీ హయాంలో సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై నమోదైన కేసులను పూర్తిగా కొట్టివేసింది. ఈ కేసులు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని న్యాయస్థానం తన…
- పీపీపీతోనే వేగంగా అభివృద్ధి.. ‘వీజీఎఫ్ విప్లవం ఖాయం.రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానమే కీలకమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పీపీపీ ప్రాజెక్టులు, ప్రభుత్వ వ్యయంపై అధికారులతో సమీక్షించిన సీఎం… త్వరలోనే ‘ఏపీ పీపీపీ-వీజీఎఫ్ పాలసీ 1.0’ను తీసుకురావాలని ఆదేశించారు. ఏపీ అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు…
- కరీంనగర్ జిల్లా ఘన్ముక్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విచిత్ర పరిస్థితి.ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఆధునిక తరగతి గదులు, డిజిటల్ బోర్డులు, కంప్యూటర్ ల్యాబ్లు, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. అయితే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఒక ప్రభుత్వ ఉన్నత…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Total views : 212472