ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ద్విచక్ర వాహనం పై వెళుతున్న దంపతులను వెనుక నుండి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటన లో గుంటూరు జిల్లా చిలకలూరిపేట కి చెందిన మల్లారపు వెంకట్రావు ప్రాణాల తో బయట పడగా.. అతని భార్య వెంకాయమ్మ ఘటనాస్థలం లోనే దుర్మరణం పాలైంది. జీ కొండూరు మండలం చిన్న నందిగామ మామిడి తోటలో కాపలా కి పనిచేస్తున్న వెంకట్రావు భార్యతో కలిసి మైలవరం రైతు బజార్ లో కూరగాయలు కొనడానికి వచ్చి తిరిగి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
rtc bus accident
ప్రయాణికులు ప్రయాణించుతూన్న ఆర్థీసీ బస్సు ప్రమాదానికి గురి అవ్వటం చాలా భాధాకరమని, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. ఈరోజు ఉదయం పదిగంటల సమయంలో చల్లపల్లి మండలం శివారు మేకావారిపాలెం గ్రామంలో నడకుదురు ప్రధాన రహదారిపై ఆర్టీసీ కరకట్ట ఎక్స్ ప్రెస్ బస్సు ప్రమాదానికి గురైంది. విషయం తెలుసుకున్న అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ముందుగా చల్లపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వారితో మాట్లాడి వారి గాయాల గురించి ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో నలుగురు గాయాలకు గురికాగా వారికి ఇక్కడ ప్రాథమిక చికిత్స అందించారని, మెరుగైన చికిత్స నిమిత్తం మచిలీపట్నం ఆసుపత్రికి తరలిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలిపారు. అనంతరం ఘటనా స్థలికి చేరుకొని బస్సును పరిశీలించి, ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు అక్కడ ఉన్న గ్రామస్తులును, పోలీసు అదికారులను అడిగితేలుసుకున్నారు.
వరంగల్ జిల్లాలో ఆర్టీసీ బస్సు కు తప్పిన పెను ప్రమాదం. హన్మకొండ నుండి ఏటూరునాగారం వెళ్తుండగా దామెరా మండలం ఒగ్లపూర్ వద్ద బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు. ప్రమాదం సమయంలో బస్సు లో 60మంది ప్రయాణికులు. 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు. రోడ్ దిగి పత్తి చెనులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు. వరంగల్ 2 డిపో కు చెందిన బస్సు గా గుర్తింపు.




Total views : 79960