తెలంగాణలో త్వరలో కులగణన చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ విభాగాలపై సీఎం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని, వీటికి సొంత భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన భవనాల నిర్మాణానికి సరిపడే స్థలాలను గుర్తించాలని సూచించారు. స్కూల్ భవనాల నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసి బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ఇచ్చే డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు, వంట బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. గ్రీన్ ఛానెల్ ద్వారా చెల్లింపులు చేయాలన్నారు.
SC
రాష్ట్రంలో పేద వర్గాలకు జరిగిన లబ్ది వివరించేందుకు సామాజిక సాధికార బస్సు యాత్ర చేపడుతున్నామని ఎమ్మెల్యే పార్థసారధి తెలిపారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో మొత్తంగా 1.10 లక్షల మందికి 12 వేల 99 కోట్ల రూపాయలు లబ్ది చేకూరిందని ఎమ్మెల్యే తెలిపారు. పేద వాళ్లకు 29 వేల పైచిలుకు ఇళ్ల స్థలాలు ఇచ్చామని కాలువ గట్లలో నివసించేవారికి 75 శాతం సిమెంట్ రోడ్లు, నీటి కుళాయిలు సౌకర్యాలు కల్పించామన్నారు. పెనమలూరు నియోజకవర్గ వ్యాప్తంగా 30 వేల జనాభా ఉన్న మైనార్టీల కోసం 3 షాధికాణాలు నిర్మించామని తెలిపారు. మార్కెట్ యార్డులు, PACS, CSC చైర్మన్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఇచ్చామన్నారు.
బందరు కాలువలో పూడికతీత మా ప్రభుత్వం హయాంలోనే పూర్తి చేసామని పార్థసారధి తెలిపారు.
Read Also..
Read Also..





Total views : 78030