68
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలదేనని నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎస్ఐఆర్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూత్ లెవెల్ ఏజెంట్లు , కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగే ఈ నెల రోజుల పాటు కాంగ్రెస్ కార్యకర్తలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో మన ఓట్లను మనం కాపాడుకోకపోతే… బెంగాల్, బీహార్ రాష్ట్రాల మాదిరిగా ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మనుగడ కష్టమవుతుందని మంత్రి జూపల్లి హెచ్చరించారు.





Total views : 180026