51
బారాషాహిద్ దర్గా మరింత అభివృద్ధి చెందడానికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలిపారు. కుటుంబ సమేతంగా దర్గాను దర్శించుకున్న ఆయన… పవిత్ర రొట్టెల పండగ తమ కుటుంబానికి ఒక సెంటిమెంట్ అని పేర్కొన్నారు. గతంలో తాను స్వీకరించిన ఎమ్మెల్యే రొట్టెను, ఈసారి తన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి అందించారు. బారాషాహీద్ ఆశీస్సులతో 2029 ఎన్నికల్లో తన సోదరుడు గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని ఆకాంక్షిస్తున్నట్లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఎన్నడూ లేని విధంగా 700 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.





Total views : 180026