తుఫాను ప్రభావానికి బాపట్ల జిల్లాలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. భట్టిప్రోలు మండలంలో పర్యటించిన ఆయన పంట పొలాలను,జగనన్న కాలనీలను పరిశీలించారు. తుఫాను వస్తుందని తెలిసి కూడా సరైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని ఆరోపించారు. వర్షపు నీరు పోయేందుకు డ్రైనేజీ కాలువలు సరిగా లేకపోవడంతో నీటిలోనే… పంట నాని ఎక్కువ నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే రైతులకు ఎక్కువ నష్టం జరుగుతోందన్నారు. నష్ట పోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని సిఎం జగన్ అన్ని చర్యలు తీసుకున్నాం అనడం సరికాదనీ క్షేత్ర స్థాయిలోకి వచ్చి రైతుల పరిస్తితి తెలుసుకోవాలన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేశారు. మరోవైపు వర్షపు నీటిని జగన్న కాలనీలు అధ్వానంగా మారి నడిచేందుకు కూడా ఇబ్బంది కరంగా మారాయన్నారు. సరైన సౌకర్యాలు లేక కాలనీల్లో ఉంటున్న పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.తుఫాను ప్రభావంతో వాణిజ్య పంటలు దెబ్బతిని లంక గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు.అరటి తోటలు గాలుల ప్రభావానికి నేల వాలయి ..కంద,పసుపు పంటలు వర్షపు నీటితో నాని రైతులకు నష్టం వాటిల్లింది.చేతికి వచ్చిన పంటలు దెబ్బతిని నష్టాన్ని మిగిల్చాయి అని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు
storm effect
తుఫాన్ కారణంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అన్నంపల్లి-పల్లంకుర్రు ఏటిగట్టు కుంగిపోతున్నది. కుండళేశ్వరం ప్రాంతంలో కిలోమీటర్ మేర కుంగి ఏటిగట్టు రహదారి ప్రమాదబరితంగా మారింది. ఇటివలే ఆధునికీకరణ చేసిన ఈ రహదారి ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన మండలాల ప్రజలకు రాకపోకలకు ముఖ్యమైన రహదారని, పూర్తి గా దెబ్బతినకముందే రక్షణ చర్యలు చెపట్టి ఆధునికీకరణ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఉలవపాడు మండలంలోని విద్యుత్ సిబ్బంది విద్యుత్ సరఫరాలో ఎంత అప్రమత్తంగా ఉన్నా ఎప్పటియో విద్యుత్ వైర్లకు అమర్చిన పింగాణి ఇన్సులేటర్లు డేమేజ్ అవ్వటం వల్ల చిన్న చినుకు పడితే విద్యుత్ కు అంతరాయం ఏర్పడుతుంది. ఇందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తుఫాను తాకిడికి వెటర్నరీ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో బలమైన చెట్టుకొమ్మ విరిగి విద్యుత్ వైర్ల పై మరియు విద్యుత్ వైర్లు కింద ఉన్న రేకుల షెడ్డుపై పడగా అందులో నివసిస్తున్న వారు భయభ్రాంతులకు గురి అయ్యి పరుగులు తీశారు. అయితే చెట్టుకొమ్మ వల్ల గాని విద్యుత్ వల్ల కానీఎవరికి ఇటువంటి ప్రమాదం జరగలేదు. స్వల్పంగా రేకుల పూరి ఇల్లు దెబ్బతినింది. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే స్పందించిన విద్యుత్ అధికారులు మండలాధికారులు సంఘటనా స్థలాన్ని చేరుకొని చెట్టు కొమ్మను తొలగించి విద్యుత్తును పునర్వదించారు. ఆ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని తుఫాను ప్రభావం తగ్గేంతవరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునర్వాస కేంద్రాలలో తలదాచుకోవాలని అధికారులు తెలియజేశారు.
మిచాంగ్ తుఫాను ప్రభావం వల్ల ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నెల్లూరు, మచిలీపట్నం మధ్యన తీరం దాటనున్న తుఫాన్. డిసెంబర్ 5 మధ్యాహ్నం తీరం దాటనున్నందున ఐఎండి ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాలకు భారీ వర్షం సూచన నమోదయ్యే అవకాశం ఉంది. గత నెలలో బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ఆంధ్రప్రదేశ్ కు త్రుటిలో తప్పింది, కానీ మరో తుఫాను బంగాళాఖాతంలో ఏర్పడి ఇది ఏపీ దిశగా తీసుకొస్తున్నట్లుగా ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపద్యంలో కోస్తా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ విభాగం హెచ్చరించింది. ఇదే సమయంలో మత్స్యకారులు సైతం వేటకు వెళ్ళద్దని గంటకు 110 కిలోమీటర్లకు పైగా బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. ఈ తుఫాన్ ప్రభావం దృశ్య తీర ప్రాంతాన్ని సోమవారం సబ్ కలెక్టర్ శోభిక పర్యటించి తుఫాను ప్రభావం వలన లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అన్ని వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించడంతో, ఆమె సూచనల మేరకు ఉలవపాడు మండలంలోని కోటిరెడ్డి ఎస్టీ కాలనీ, మన్నేటికోట పంచాయతీ పరిధిలోని తిరుపతమ్మ గుంట, చాకిచెర్ల పంచాయతీలోని ఎస్టీ కాలనీ మరియు కరేడు పంచాయతీలోనిమర్రి చెట్టు సంఘం బాలకోటయ్య సంఘం తదితర గిరిజన సంఘాలలో నీ ప్రజలను అప్రమత్తం చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి అధికారుల పర్యవేక్షణలోవారికి నీటి వసతి భోజనం వసతి ఏర్పాటు చేసి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. తుఫాను తీరం దాటే సమయాలలో ఎటువంటి పరిస్థితులలో కూడా ముఖ్యమైన పరిస్థితులలో తప్ప ప్రజలు సురక్షిత ప్రాంతాలను విడిచి బయటకు రాకూడదని తెలియజేశారు
బాపట్ల మండలం సూర్యలంక సముద్ర తీరంలో మిచాంగ్ తుఫాన్ నేపథ్యంలో సముద్ర తీరాన్ని పరిశీలించిన బాపట్ల జిల్లా కలెక్టర్ పి.రంజిత్ భాష, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, బాపట్ల శాసనసభ్యులు కోనా రఘుపతి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నెల్లూరు మచిలీపట్నం తీరాల మధ్యలో తీవ్ర వాయుగుండంగా మారే తరుణంలో, బాపట్ల జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గత రెండు రోజులుగా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా మొత్తాన్ని అప్రమత్తం చేయడం జరిగిందని ఆయన అన్నారు. నెల్లూరు మచిలీపట్నం చీరాల మధ్యలో అంటే బాపట్ల ఉందని ఐఎండి హెచ్చరికల్ని పద్యంలో సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సముద్రంలో ఎవరూ లేకుండా చూడాలని మత్స్యశాఖ అధికారులు ఆదేశించమని అన్నారు. ఎక్కడైనా ఎలాంటి ఇపత్కర పరిస్థితి అయినా ఎదుర్కోటానికి బాపట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఆయన అన్నారు. ఎక్కడైనా ఎటువంటి సంఘటన జరిగిన బాపట్ల కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ ముకుల్ జిందాల్ మాట్లాడుతూ బాపట్ల జిల్లా సముద్ర తీరా ప్రాంతాల్లో ప్రజలు లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, ఎక్కడైనా ఎటువంటి సంఘటన జరిగిన రెస్క్యూ టీం పోలీస్ శాఖలు సంసిద్ధంగా ఉన్నాయని ఆ న్నారు.ఎక్కడ ఎటువంటి విపత్కర పరిస్థితిలు జరిగిన పోలీస్ యంత్రాంగం అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు. బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున ప్రజలకు ఎటువంటి సహాయం అందించడానికి అయినా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజలు భయాందోళన గురికాకుండా అందరూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లి, ప్రభుత్వ ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంపుల్లో తల దాచుకోవాలని ఆయన అన్నారు.
తుఫాన్ నేపద్యంలో రామచంద్రపురం నియోజకవర్గంలో పలు గ్రామాలు పర్యటించి పంట పొలాలను రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు పరిశిలించారు. కె. గంగవరం మండలం కుందూరు గ్రామంలో తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షం వల్ల తడిసిన ధాన్యపు రాశులను మంత్రి వేణు పరిశీలించి అధికారులతో మాట్లాడి తడిసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు మంత్రి వేణు తరలించారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు. తడిసిన ధాన్యాన్ని
ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి వేణు రైతులకు భరోసా ఇచ్చారు. మంత్రి వేణు వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైసీపీ నాయకులు ఉన్నారు.





Total views : 78869