Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh మిచాంగ్ తుఫాను ప్రభావం: ఎల్లో అలర్ట్ జారీ

మిచాంగ్ తుఫాను ప్రభావం: ఎల్లో అలర్ట్ జారీ

by
yellow allert

మిచాంగ్ తుఫాను ప్రభావం వల్ల ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నెల్లూరు, మచిలీపట్నం మధ్యన తీరం దాటనున్న తుఫాన్. డిసెంబర్ 5 మధ్యాహ్నం తీరం దాటనున్నందున ఐఎండి ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాలకు భారీ వర్షం సూచన నమోదయ్యే అవకాశం ఉంది. గత నెలలో బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ఆంధ్రప్రదేశ్ కు త్రుటిలో తప్పింది, కానీ మరో తుఫాను బంగాళాఖాతంలో ఏర్పడి ఇది ఏపీ దిశగా తీసుకొస్తున్నట్లుగా ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపద్యంలో కోస్తా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ విభాగం హెచ్చరించింది. ఇదే సమయంలో మత్స్యకారులు సైతం వేటకు వెళ్ళద్దని గంటకు 110 కిలోమీటర్లకు పైగా బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. ఈ తుఫాన్ ప్రభావం దృశ్య తీర ప్రాంతాన్ని సోమవారం సబ్ కలెక్టర్ శోభిక పర్యటించి తుఫాను ప్రభావం వలన లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అన్ని వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించడంతో, ఆమె సూచనల మేరకు ఉలవపాడు మండలంలోని కోటిరెడ్డి ఎస్టీ కాలనీ, మన్నేటికోట పంచాయతీ పరిధిలోని తిరుపతమ్మ గుంట, చాకిచెర్ల పంచాయతీలోని ఎస్టీ కాలనీ మరియు కరేడు పంచాయతీలోనిమర్రి చెట్టు సంఘం బాలకోటయ్య సంఘం తదితర గిరిజన సంఘాలలో నీ ప్రజలను అప్రమత్తం చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి అధికారుల పర్యవేక్షణలోవారికి నీటి వసతి భోజనం వసతి ఏర్పాటు చేసి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. తుఫాను తీరం దాటే సమయాలలో ఎటువంటి పరిస్థితులలో కూడా ముఖ్యమైన పరిస్థితులలో తప్ప ప్రజలు సురక్షిత ప్రాంతాలను విడిచి బయటకు రాకూడదని తెలియజేశారు

Advertisements

You may also like

Our Visitor

019337
Total views : 90424

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.