ఇటీవల ఒంగోలులోని జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట మార్కాపురం కు చెందిన నలుగురు వ్యక్తులు తమ భూములను ఆక్రమించి బెదిరిస్తున్నారని మీడియాతో మాట్లాడారు.ఈ క్రమం లో కొందరు నాపై ఆరోపణలు చేయడం విచారకరం. దీనిపై వివరణ ఇవ్వాలని భావించానని, అందుకే మీడియా సమావేశం ఏర్పాటు చేశానని, ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దరిమడుగు గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి కి,అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో భూ తగాదాలు ఉన్నాయని, ఇందులో నన్ను లాగడం మంచిపద్దతి కాదన్నారు. గ్రామ చెరువు దశాబ్దాల క్రితం నాటి అంశం అని అన్నారు. రామడుగు రమేష్ కు, మా పార్టీ కే చెందిన మరో వ్యక్తితో ఉన్న విభేదాలు అని అన్నారు. మా పార్టీ అంతర్గత వ్యవహారం అని దానిని మేం సరిచేస్తున్నామని తెలిపారు. పోరెడ్డి నాగిరెడ్డి విషయం లో నాకు ఎలాంటి సంబంధం లేదని, నాగిరెడ్డి ద్వారా మోసపోయిన వారికి నేను మద్దతు ఇచ్చానని, చెప్పారు. పై విషయాల్లో నాకు ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని నాకు సంబంధం లేదని స్పష్టం చేశారు. దేవాలయ అభివృద్ధి నిధులు మీ పార్టీ వారే లెక్కలు చూస్తున్నారని, విచారణ చేసుకోవాలి అని సలహా ఇచ్చారు. భూ ఆక్రమాలలో ఎలాంటి పనైనా సిట్ ద్వారా పరిష్కారం చేసుకుందాం రా అని హెచ్చరించారు. అభివృద్ధి విషయంలో ఎక్కడైనా చర్చకు సిద్ధమంటూ టీడీపీ నాయకులకు . సవాల్ విసిరారు.
tdp Activists
చంద్రబాబు నాయుడుకు స్కిల్ స్కాం కేసులో బెయిల్ రావడంతో టిడిపి, కపిలేశ్వర ఆలయంలో గుండు కొట్టించుకొని మ్రొక్కులు చెల్లించుకున్నారు
టిడిపి అధినేత చంద్రబాబు కు హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో తిరుపతి అలిపిరి మెట్ల దగ్గర టిడిపి, జనసేన నేతలు,కార్యకర్తలు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.తమ అధినేతకు అడ్డంకులు తొలగిపోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ లో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
టిడిపి నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పై కక్షపూరితంగా కేసులు పెట్టి జైలు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు నాయుడుకు బెయిల్ రావడంతో న్యాయం గెలిచిందని, ఎలాంటి అవినీతి చేయిని చంద్రబాబు నాయుడు పై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా అక్రమంగా అరెస్టు చేశారని మండి పడ్డారు. ముఖ్యమంత్రి పద్నాలుగు కేసుల్లో బెయిల్ మీద ఉన్నాడని, అధికారి పార్టీ గుర్తు తెచ్చుకోవాలని, చంద్రబాబు నాయుడు మచ్చలేని నాయకుడని తెలిపారు. చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో కూడా నిర్దోషిగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.






Total views : 78453