నిజం గెలిసింది కాబట్టే చంద్రబాబు నాలుగు వరాల పాటు మధ్యంతర బెయిల్ పై బయటకు వస్తున్నారని. జగన్ జైల్లో ఉన్నాడని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. చంద్రబాబుని కూడా జైల్లో పెట్టాలని కుట్రపన్ని జైల్లో పెట్టించారని. అరెస్ట్ చేయించి ఆధారాలు లేకుండా కాలయాపన చేశారని. తమ నాయకుడు బయటికి రావడం పై హర్షం వ్యక్తం చేస్తున్నామంటున్నా టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో మా కాకినాడ జిల్లా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్.
telangana
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించారు. బాన్సువాడ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ఈ మేరకు మాట్లాడారు. మనం సమస్యల మీద యుద్ధం చేస్తున్నాం. కానీ ప్రతిపక్షాలు ఈరోజు సిద్దిపేట జిల్లాలో దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేయించాయి. అదృష్టం కొద్దీ ఆయనకు అపాయం తప్పింది. ఎన్నికలను ఎదుర్కొనే సత్తా లేక ప్రజలకు ముఖం చూపించలేక.. ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. కత్తులతో మా అభ్యర్థులపై దాడులు చేస్తున్నారు. దీనికి తెలంగాణ సమాజమే బుద్ధి చెప్పాలి. తస్మాత్ జాగ్రత్త! పదేళ్లలో ఎన్నో ఎన్నికలు జరిగాయి, ఎన్నడూ హింసకు దిగలేదు. ప్రజలు గెలిపిస్తే గెలిచాం, చేతనైనకాడికి సేవ చేశాం. ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయలేదు. మా సహనాన్ని పరీక్షిస్తే ఊరుకోం. ఇవాళ దుబ్బాక అభ్యర్థి ప్రభాకర్ మీద జరిగిన దాడి నాపై జరిగిన దాడిగానే భావిస్తా. ఈ దాడులను ఆపకపోతే చూస్తూ ఊరుకోం. మేం బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాం. ప్రజలకు ఎలా సేవ చేయాలనే ఆలోచనల్లో మేముంటే.. మీరు ఇలా దుర్మార్గమైన పనుల్లో ఉన్నారు. ఇది రాజకీయమా? అని కేసీఆర్ ప్రశ్నించారు.
తెలంగాణ బీజేపీ అగ్రనేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తనకు బెదిరింపులు వచ్చేవని ఆయన తెలిపారు. చార్మినార్ వద్ద బీజేపీ సభ పెడితే తన భార్య తలను నరికి బహుమతిగా పంపిస్తామని, కొడుకులను కిడ్నాప్ చేస్తామని బెదిరించారని చెప్పారు. అయితే బెదిరింపులకు భయపడకుండా ధైర్యంగా పాతబస్తీలో సభను నిర్వహించామని తెలిపారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదంతో బీజేపీని బలోపేతం చేయడానికి ధైర్యంగా పాతబస్తీలో సభను పెట్టామని చెప్పారు. బెదిరింపులకు భయపడకుండా చార్మినార్ ఎదుటే సభను నిర్వహించామని తెలిపారు. పార్టీ కోసం తెగించి, ధైర్యంగా ముందుకు వెళ్లిన చరిత్ర తమదని అన్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు కూడా తన మాదిరే ఎన్నో బెదిరింపులు వచ్చాయని. ఆయనను చంపేస్తామని బెదిరించారని సంజయ్ తెలిపారు. అయినా, రాజాసింగ్ భయపడకుండా హిందూ ధర్మం కోసం తన పోరాటాన్ని కొనసాగించారని చెప్పారు. బీజేపీకి ఏడాది పాటు దూరమైనా. ధర్మం కోసం పోరాడుతూనే ఉన్నారని కితాబిచ్చారు. బీజేపీ గెలుస్తుందనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. బీజేపీ గెలిస్తే బీసీ నేత సీఎం అవుతారని అన్నారు. ఇప్పటికే బీజేపీ నేతలంతా ప్రజల్లోకి వెళ్లారని. ఎన్నికల ప్రచారంలో పూర్తిగా నిమగ్నమయ్యారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సభలను నిర్వహిస్తామని తెలిపారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. సర్వేలలో ప్రతిపక్షాలు గెలిస్తే, ఎన్నికల ఫలితాల మాత్రం బీఆర్ఎస్ గెలుస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ 95 నుంచి 105 స్థానాల్లో గెలుస్తుందన్నారు. హంగ్కు ఎలాంటి ఆస్కారం లేదన్నారు. 2018లోనూ ఇలాగే చేశారన్నారు. కేంద్రమంత్రి అమిత్ షా బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించడం కేవలం ఎన్నికల గిమ్మిక్కు అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన పాత్ర ఏమీ లేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఎలాంటి డీల్ లేదన్నారు. చంద్రబాబు అరెస్టుపై మీ సమాధానం ఏమిటి? అని ఓ నెటిజన్ అడగగా.. ఈ వయస్సులో ఆయనకు అలా జరగడం దురదృష్టకరమన్నారు. ఆయన కుటుంబం పడుతున్న బాధను తాను అర్థం చేసుకోగలనన్నారు. వారి కుటుంబానికి ఎమ్మెల్సీ కవిత సానుభూతి తెలిపారు.
ఖమ్మం వాకర్స్ అసోసియేన్ సీనియర్ సిటిజన్స్ కోరుకునే విధంగా ఖమ్మం జిల్లాలను అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం పట్టణ పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో తుమ్మల నాగేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్భగా తుమ్మల మాట్లాడుతూ. మనం ఆరోగ్యంగా ఉంటూ సమాజం ఆరోగ్యంగా ఉండేలా పాటుపడాలని.. కలుషిత రాజకీయాలను దూరం చేసి మానసికంగా దృఢంగా ఉండేలా అడుగులు వేయాలని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా లో పాలేరు నుంచి పాపికొండల వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం దక్కిందని. నవంబర్ 30 న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని తుమ్మల కోరారు. బీఆర్ఎస్ పాలనలో ఖమ్మంలో అభివృద్ధి శూన్యమని.. జిల్లాలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు.
కరీంనగర్ జిల్లాలో బీజేపీ కి బిగ్ షాక్త గిలింది. మానకొండూర్ బీజేపీ అసెంబ్లీ ఇంచార్జీ గడ్డం నాగరాజు త్వరలో గులాబీ గూటికీ చేరానున్నారు. గతంలో రెండు సార్లు మానకొండూర్ బీజెపి ఎమ్మెల్యే అభ్యర్తిగా పోటీ చేసిన నాగరాజుకు ఈసారి టికెట్ రాకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు లోనయ్యారు. గత 30 ఏళ్లుగా పార్టీ పటిష్టత కోసం కష్ట పడిన తనను కాదని కొత్తగా చేరిన అరేపల్లి మోహన్ కి టికెట్ కేటాయించడం పట్ల గడ్డం నాగరాజు గులాబీ గూటికీ చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ ఉదయం రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరియు బీ ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ.జీవి. రామకృష్ణారావు నాగరాజును మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వానించారు. త్వరలో భారీ సంఖ్యలో తమ అనుచరులతో పాటు బీజేపీ కార్యకర్తలతో కలిసి బీ ఆర్ ఎస్ పార్టీలో చేరనున్నారు.
పోలీస్ అమరవీరుల దినోత్సవ వారోత్సవాలలో భాగంగా ఏ.ఆర్.గ్రౌండ్స్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో భాగంగా పోలీస్, అగ్నిమాపక మరియు NDRF కి సంబంధించిన పరికరాలను ప్రదర్శించారు. ప్రదర్శన లో భాగంగా ఏర్పాటు చేసిన పోలీస్ జాగిలాలు, రైఫిల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమంలో వందల సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాలోన్నారు. ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం రెండు రోజులపాటు కొనసాగుతుందని విజయవాడ సిటీ కమిషనర్ కాంతి రానా తెలిపారు.
కంటోన్మెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని డాక్టర్ వెన్నెల ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజా నౌక,ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె డాక్టర్ వెన్నెలకు టికెట్ కేటాయించారు. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు,గద్దర్ అభిమానులు,కళాకారులు వెన్నెల ఇంటికి వెళ్లి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వెన్నెల మీడియాతో మాట్లాడారు. నాపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ టికెట్ కేటాయించిన సోనియా,రాహుల్ ,రేవంత్ తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేస్తానని అన్నారు. గద్దర్ బిడ్డ గా ముందుకెళ్తానని, భారీ మెజారిటీ తో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
అక్టోబర్ 26న అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో సభతో ప్రచారం షెడ్యూల్ మొదలయ్య. నవంబర్ 08 సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో సభతో ముగియనుంది. ఇందులో భాగంగానే. సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ లో ఈ నెల 30న సీఎం కేసీఆర్ పర్యటన జరగనుంది. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను ఎస్పీ చెన్నూరి రూపేష్ పరిశీలించారు. బందోస్తుకు సంబంధించి. పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం పర్యటన సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని. ట్రాఫిక్ డైవర్షన్ చేసి, విధులలో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయం పాటించాలని సూచించారు ఎస్పీ చెన్నూరి రూపేష్.
ములుగు జిల్లా ముకునూరు పాలెం గ్రామ శివారులో జామాయిల్ తోటలో భారీ స్థాయిలో కోడి పందేలు నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కోడిపందాల స్థావరాలపై మెరుపు దాడులు జరిపారు. ఈ సందర్భంగా 8మంది పందెం రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు కోడి పుంజులు, రెండు కత్తులు, 4000 నగదును వెంకటాపురం పోలీసులు. స్వాధీనం చేసుకున్నారు. కాగా జామాయిల్ తోటలో స్థావరాలను ఏర్పాటుచేసుకుని తరచూ పందేలు నిర్వహించటం పరిపాటిగా మారింది. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించి పందెం రాయుళ్లను అరెస్టు చేశారు.






Total views : 91022