270
అక్టోబర్ 26న అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో సభతో ప్రచారం షెడ్యూల్ మొదలయ్య. నవంబర్ 08 సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో సభతో ముగియనుంది. ఇందులో భాగంగానే. సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ లో ఈ నెల 30న సీఎం కేసీఆర్ పర్యటన జరగనుంది. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను ఎస్పీ చెన్నూరి రూపేష్ పరిశీలించారు. బందోస్తుకు సంబంధించి. పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం పర్యటన సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని. ట్రాఫిక్ డైవర్షన్ చేసి, విధులలో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయం పాటించాలని సూచించారు ఎస్పీ చెన్నూరి రూపేష్.





Total views : 62339