తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్. నియోజకవర్గంలో స్కాములు చేసినవాళ్లు ఉన్నారని, ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఇళ్ల పట్టాల సమస్య, నిరుద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తానని చెప్పారు కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్.
telangana elctions 2023
వనపర్తి పట్టణ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణంలో నేడు రేవంత్ రెడ్డి బహిరంగ సభకు విజయవంతం చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మెగా రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు . సభస్థల అవారణాన్ని ఆయన పరిశీలించారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. వనపర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు
డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ కుల, మతాల చిచ్చు పెట్టాలి అని చూస్తుంది- కేటీఆర్
కాంగ్రెస్ పార్టీకి తప్పుడు వాగ్ధానాలు చేయడం కోత్తేమీ కాదని, గతంలోనూ చాలా సార్లు ఇలాంటి తప్పుడు వాగ్ధానాలు ఇచ్చిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ముస్లిం మైనారిటీలను బీసీలుగా గుర్తిస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోందని, అలా చేస్తే మైనారిటీలు ప్రత్యేక హోదా పోతుందని అన్నారు. మైనారిటీ డిక్లరేషన్ పేరుతో బీసీలకు, ముస్లింలకు మధ్య చిచ్చు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టాలని కుట్ర చేస్తోందని విమర్శించారు.




Total views : 80396