తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఆగస్ట్ 3 వరకు ఎన్యూమరేషన్ ఫారాలను స్వీకరించనున్నట్లు తెలిపింది. ఆగస్ట్ 10న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన, ఆగస్ట్ 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ చేపట్టనుంది. అభ్యంతరాలపై విచారణకు అక్టోబర్ 8 వరకు ఈసీఐ తుదిగడువు విధించింది. సర్ గడువును పొడిగించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీంతో సర్ షెడ్యూల్ను సీఈసీ సవరించింది. బూత్ స్థాయి అధికారులు చేపట్టే ఇంటింటి సర్వేలో భాగంగా నకిలీ ఓట్లు తొలగింపు, మరణించిన వారి పేర్ల తొలగింపు, చిరునామా మార్పులు వంటి సవరణలు చేపడతారు. సవరించిన గడువులను కచ్చితంగా పాటించాలని ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
Tag:





Total views : 212171