నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతిని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ఆయన విగ్రహానికి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఆశయాలను కొనియాడారు. అంబేద్కర్ గారు గొప్ప దార్శనికుడు అని, ఎందరికో ఆదర్శవంతుడు అంబేద్కర్ అని అన్నారు. పట్టణంలోని పలువురు ముఖ్య నాయకులతో పాటు, అధికారులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ts politics
చెన్నూరు నియోజకవర్గం లోని స్థానిక మందమర్రి పట్టణ మార్కెట్ లో చెన్నూరు నియోజీకవర్గా ఎమ్మెల్యే గడ్డం వివేక్ నల్లాల ఓదెలు అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం ప్రకటించిన సందర్బంగా కాంగ్రెస్ నాయకులు టపాసులు పేల్చి సంబరాలు .చేసారు .ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కసార్ల శ్రీనివాస్, గడ్డం శ్రీనివాస్ మాజీ NSUI స్టేట్ సెక్రెటరీ మహంత్ అర్జున్ కుమార్ యూత్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు
పెద్దపల్లి జిల్లాలో ముఖ్య నేతలు ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఈ దంపతులు ఇద్దరు కూడా రాజీనామా చేయనున్నామని వెల్లడించడం సంచలనంగా మారింది. జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్, ఆయన సతీమణి, మంథని మునిసిపల్ ఛైర్ పర్సన్ పుట్ట శైలజలు ప్రజాప్రతినిధులుగా రాజీనామా చేయనున్నట్టు ఆయన కార్యాలయ వర్గాల పేరిట ఓ ప్రకటన వెలువడింది. బుధవారం మద్యాహ్నం రాజీనామా పత్రాలను జిల్లా కలెక్టర్ కు అప్పగించనున్నామని కూడా అందులో వివరించారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంథని ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసిన పుట్ట మధూకర్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబు చేతిలో ఓటమి పాలయ్యారు. ఫలితాలు వెలువడినప్పటి నుండి కూడా సైలెంట్ గానే ఉన్న పుట్ట మధు అనూహ్యంగా రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా శ్రీధర్ బాబుకు, పుట్ట మధుకు దశాబ్దన్నర కాలంగా వైరుధ్యాలు ఉన్నాయి. దీంతో ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్టుగానే పొలిటికల్ ఫైట్ జరిగిందనే చెప్పాలి. అయితే తాజాగా పుట్ట మధు తీసుకున్న నిర్ణయంతో బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన అంశంపై పెద్ద ఎత్తున డిస్కషన్ సాగుతోంది. అయితే బుధవారం రాజీనామా చేసిన తరువాత రాజీనామాకు గల కారణాలను వెల్లడించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాట్లుకు రంగం సిద్ధమైంది. సోమవారం సాయంత్రం తెలంగాణ రాజ్భవన్లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రమాణ స్వీకరానికి కావాల్సిన సామ్రాగ్రిని కూడా తరలిస్తున్నారు. వివరాల ప్రకారం రాజ్భవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి జీఏడీ ఏర్పాటు చేస్తోంది. రాజ్భవన్కు సామాగ్రి చేరుకుంటోంది. మూడు దిసెంలలో టెంట్లు, స్టాండ్స్, టేబుల్స్, కుర్చీలు, రెడ్ కార్పెట్లు, ఫర్నిచర్ చేరుకుంది. రాజ్ భవన్కు చేరుకున్న లైవ్ కవరేజ్ ఐ అండ్ పీఆర్ మీడియా. గవర్నర్ తమిళిసై ఏ క్షణంలోనైనా ఆదేశం ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు సీఈవో వికాస్రాజ్ రాజ్భవన్కు వెళ్లనున్నారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల లిస్ట్ను గవర్నర్కు వికాస్రాజ్ అందజేయనున్నారు. ఇక, నివేదిక అందాక కొత్త శాసనసభ ఏర్పాటుకు గవర్నర్ గెజట్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత పొలిటికల్ అపాయింట్మెంట్స్ అని రాజ్భవన్ వర్గాలు అంటున్నాయి.
ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం. ప్రపంచం మెచ్చేలా అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ లో అమలు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించడానికి కారణాలను లోతుగా అధ్యయనం చేయాల్సిఉంది. మా లోపాలను కచ్చితంగా సమీక్షించుకుంటాం. కొత్తగా కొలువు తీరబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనలు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు దిశగా కొత్త ప్రభుత్వం పని చేయాలని కోరుకుంటున్నాను.
ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇచ్చి ప్రభుత్వంలోకి తీసుకొచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు ఆధ్వర్యంలో రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 108 కొబ్బరికాయలు కొట్టి స్వీట్లు పంచుకొని ఘనంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు మాట్లాడుతూ మునుగోడు ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు. రాజగోపాల్ రెడ్డి ఆపదలో ఉన్నా అంటే నేనున్నా అని సాయం చేసే వ్యక్తి అటువంటి వ్యక్తికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే నియోజకవర్గానికి అభివృద్ధికి దోహదపడతాడని ఇప్పుడు జరుగుతున్నా సీఎల్పీ మీటింగ్ లో రాజ గోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరారు.
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చెంగిచేర్ల క్రాస్ వద్ద కారులో డబ్బులు తరలిస్తున్న వ్యక్తిని పట్టుకొని కాంగ్రెస్ నాయకులు చితకబాదారు.
కాంగ్రెస్ నాయకుల చేతిలో చితకబాదిన వ్యక్తి వద్ద తెలంగాణ పోలీసు శాఖలో వరంగల్ లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ గా అతని వద్ద ఐడి కార్డు లభించింది..
కారులో ఉన్న రెండు బ్యాగులను తీసుకొని మరికొందరు వ్యక్తులు పారిపోయినట్టు కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. స్థానిక పోలీసులు ప్లేయింగ్ స్క్వాడ్ వచ్చి తనిఖీలు చేయగా అందులో 500,200 రూపాయల నోట్ల కట్టలు లభించాయి. పోచారం మున్సిపాలిటీ, ఘట్ కేసర్ ప్రాంతాలకు తరలిస్తుంన్నారన్న సమాచారంతో కాంగ్రెస్ నాయకులు కారు అడ్డగించి పట్టుకున్నట్లు చెబుతున్నారు. అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ బిజెపి నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. డబ్బులు తరలింపు వ్యవహారం వెనకాల మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి పై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం చేస్తూ చెంగిచెర్ల క్రాస్ హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారి పై ఆందోళనకు దిగారు. కారు వద్దకి చేరుకున్న రిటర్నింగ్ అధికారి. డబ్బు స్వాదీనం చేసుకున్నారు.
పోలీస్ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు సోమవారం వరకు అవకాశం ఉన్నందున వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు. అదే విధంగా జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ సిబ్బంది (పిఓలు, ఎపిఓలు, పిఓపిలు) 23వ తేది వరకు పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 28వ తేది వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉన్నందున సిబ్బంది ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ భారతి హోలీకేరీ తెలిపారు.
Read Also…
Read Also…
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శివ్వారం గ్రామంలో బాల్క సుమన్ కు నిరసన సెగ తగిలింది. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో తమ భూములు నీట మునిగినప్పుడు రాని సుమన్ ఇప్పుడూ కూడా రావద్దని నిరసన తెలిపారు. ఇన్ని రోజులు రాని బాల్క సుమన్ ఇప్పుడు ఎం మొహం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతున్నావు అని రైతులు నిలదీశారు. 52 సర్వే నెంబర్ లో భూములు అన్యాక్రాంతం అవుతున్నా బాల్క సుమన్ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాల్క సుమన్ గో బ్యాక్ అని రైతులు ప్లకార్డులు ప్రదర్శించారు. రైతులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. నిరసన తెలుపుతున్న రైతులను సముదాయించి వెళ్లగొట్టిన పోలీసులు. బాల్క సుమన్ బాయ్ బాయ్ మా ఊరికి రావద్దు. మా ఓట్లు నీకు వేయము అంటు గ్రామస్తులు చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి ప్రత్యేక చరిత్ర ఉంది. గతంలో హేమా హేమీలిలు ఈ నియోజకవర్గం నుండి గెలుపొంది ఉన్నత పదవులను అలంకరించారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తరఫున మదన్ మోహన్, ప్రస్తుతం ముఖ్యమంత్రి తెరాస అధినేత కేసిఆర్ ఈ నియోజకవర్గం నుండే ప్రాతినిధ్యం వహించినారు. 2004 లో మొదటిసారి ఎమ్మెల్యేగా తన్నీరు హరీష్ రావు రాజకీయ అరంగ్రేటం చేసి విజయం సాధించారు. అప్పటి నుండి ఎమ్మెల్యే గా హరీష్ రావు అంచెలంచెలుగా తన మెజారిటీ తనే బ్రేక్ చేస్తూ విజయం సాధిస్తున్నారు. 2019 ఎన్నికల్లో లక్ష పద్దెనిమిది వేల పై చిలుక మెజారిటీతో ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్ దక్కకుండా భారీ మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా సిద్దిపేట నియోజకవర్గంలో మాత్రం హరీష్ రావుకు మరో మారు పట్టం కట్టి భారీ మెజారిటీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులు పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన 9 సంవత్సరాల కాలంలో సిద్దిపేట అభివృద్ధి ఆకాశానికి అంటే విధంగా జరిగింది. నియోజకవర్గం లో రంగనాయక సాగర్ ద్వారా వ్యవసానికి కాల్వల ద్వారా సాగునీటిని అందించడం, మెడికల్ కాలేజ్, సిద్దిపేటకు రైలు తేవడం తో పాటు అనేక అభివృద్ధి పనులు జరిగాయి. జిల్లా ఏర్పాటుతోనే సిద్దిపేట ఎంతో మార్పు చెంది రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన పట్టణముగా రికార్డ్ కు ఎక్కింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు మంత్రి హరీష్ రావు, కేటీఆర్ లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాలు నిర్వహిస్తూ తమ నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకుల ద్వారా ప్రచారం కొనసాగిస్తున్నారు.సిద్దిపేట నియోజకవర్గంలో నాలుగు మండలాలు, సిద్దిపేట మున్సిపాలిటీలలో అధికార బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఉండడం, బిఆర్ఎస్ కు ప్లస్ పాయింట్ మరోవైపు గ్రామ గ్రామాన హరీష్ రావుకు కార్యకర్తల బలం అదనం అసెంబ్లీ ఎన్నికల నగార మోగిన నాటి నుండి నేటి వరకు మంత్రి హరీష్ రావు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో ప్రచారం నిర్వహిస్తుండగా సిద్దిపేట నియోజకవర్గంలో మాత్రం ఇంతవరకు ప్రచారం నిర్వహించకపోవడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికల్లో అభ్యర్థులు ప్రచారాలు నిర్వహించడం జరుగుతున్న సిద్దిపేట నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్, బిజెపి,బిఎస్ పి పార్టీల అభ్యర్థులు ఉన్నా టిఆర్ఎస్ పార్టీకి పోటీ కాదని విశ్వాసంతో నాయకులు పనిచేస్తున్నారు. హరీష్ రావు చేసిన అభివృద్ధి పనులు, కార్యకర్తల బలంతో ఈసారి కూడా సిద్దిపేట అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావుకు భారీ మెజారిటీతో గెలుపొందేందుకు నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు..
Read Also…
Read Also…





Total views : 62035