టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. వారి రాజీనామాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అనంతరం న్యాయ సలహా తీసుకొని చైర్మన్ జనార్దన్ రెడ్డి తో పాటు ఐదుగురు సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం తెలిపారు. సభ్యుల రాజీనామాల ఆమోదం నేపథ్యంలో త్వరలో కొత్త కమిషన్ ఏర్పాటు కానుంది. రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్, సభ్యుల కోసం పలువురి పేర్లను పరిశీలిస్తోంది. గత చైర్మన్, బోర్డు హయాంలో జరిగిన పేపర్ లీకేజీ, ఇతర అవకతవకలపై సమగ్ర విచారణ కొనసాగించాలని ప్రభుత్వానికి గవర్నర్ సూచించారు. నిరుద్యోగుల జీవితాలతో మున్ముందు ఎవరూ ఆటలాడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగు చూడటంతో జనార్దన్ రెడ్డి ఆ సమయంలోనే రాజీనామా చేశారు. కానీ ఆయన రాజీనామాను బీఆర్ఎస్ ప్రభుత్వం తిరస్కరించింది. ప్రభుత్వం మారడంతో గత డిసెంబర్లో ఆయన మళ్లీ రాజీనామాను సమర్పించారు. తాజాగా గవర్నర్ వారి రాజీనామాలను ఆమోదించారు.
Tag:
tspsc chairman
టీ.ఎస్.పి.ఎస్.సి చైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా చేయడంతో అశోక్ నగర్ లో నిరుద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ప్రొఫెసర్ రియాజ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత బాణసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. టీ.ఎస్.పి.ఎస్.సి పేపర్ లీకేజ్ కారణంగా ఎంతో మంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. ఆయన రాజీనామాతో టీ.ఎస్.పి.ఎస్.సి ప్రక్షాళన అవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బిఆర్ఎస్ ఓటమికి నిరుద్యోగులు కారణమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో త్వరలో నోటిఫికేషన్ విడుదల అవుతుందని. నిరుద్యోగుల పోరాటానికి ప్రతిఫలం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.



Total views : 78852