తంబళ్లపల్లి భాజపా తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరిపల్లి జయచంద్ర రెడ్డి గారి పర్యటన కార్యక్రమంలో భాగంగా మన తంబాలపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోతుల సాయినాథ్ గారు ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం పోతుల సాయినాథ్ మాట్లాడుతూ కూటమి అభ్యర్థి ఐన జయచంద్రరెడ్డి విజయం సాధించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ ఐదు ఏళ్ళ లో తంబల్లపల్లి ప్రజలు చాలా కష్ట పడ్డారు త్వరలో ప్రజల కు ఈ రక్షస పాలన నుండి విముక్తి లభిస్తుందన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో అయిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన కరపత్రాలను ప్రతి ఇంట అందజేస్తూ వాటిని గురించి వివరిస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోమండల ఉపాధ్యక్షులు మురళీకృష్ణ, జనసేన సీనియర్ నాయకులు పవన్ రెడ్డి, అరవింద్, రాజేష్, బాబు, లోకేష్ టిడిపి మరియు జనసేన నాయకులు పాల్గొని విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేశారు..
Vijaya Sankalpa Yatra
దేశంలోని అన్ని పార్టీలు తమ వారసులను ప్రధానమంత్రి, ముఖ్య మంత్రి చేయాలని చేస్తున్నారు కానీ మోడీ మాత్రం దేశ ప్రజల కోసం పని చేస్తున్నారని, మోడీ అవినీతి పై పోరాటం చేస్తున్నాడు. దానికి మీ సహకారం కావాలి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కి ఓటు వేసి మరోసారి మోడీ బీజేపీ కి అవకాశం ఇవ్వాలని దేశం మరియు ప్రపంచం మొత్తం మోడీ వైపే చూస్తుందని విజయ సంకల్ప యాత్రలో పాల్గొంటున్న అశేష జనవాహిని చూస్తుంటే మళ్ళీ మోడీ ప్రధాని కావడం తధ్యమని కేంద్ర మంత్రి పరుషోత్తం రూపాల ఆశాభావం వ్యక్తం చేశారు.
బీజేపీ తెలంగాణ శాఖ నిర్వహిస్తున్న విజయ సంకల్పయాత్ర లో భాగంగా పెద్దపల్లి నియోజకవర్గంలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర సభ పెద్దపల్లి పట్టణం జండా చౌరస్తాలో ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథిగా కేంద్ర ఫిషర్స్ అండ్ పశు సంవర్దక శాఖ మంత్రి పరుషోత్తం రూపాల పాల్గొన్నారు. తెలంగాణాలో బీజేపీ విజయ సంకల్ప యాత్రతో మంచి స్పందన వస్తుందని, మోడీ నేత్రుత్వం లో పారదర్శక పాలన కొనసాగుతుందని, అయోధ్యలో రామమందిరం నిర్మాణం 500 సంవత్సరాల దేశ ప్రజల కళ మోడీ నేత్రత్వంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట చేసి దేశ ప్రజలకు భాగ్యం కల్పించారు. ఎలాంటి అవినీతి లేకుండా పాలన జరుగుతుంది
దేశంలోని అన్ని పార్టీలు తమ వారసులను ప్రధానమంత్రి, ముఖ్య మంత్రి చేయాలని చేస్తున్నారు కానీ మోడీ మాత్రం దేశ ప్రజల కోసం పని చేస్తుందని, మోడీ అవినీతి పై పోరాటం చేస్తున్నాడు దానికి మీ సహకారం కావాలి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కి ఓటు వేసి మరోసారి మోడీ కి అవకాశం ఇవ్వాలని కోరారు.
Vijaya Sankalpa Yatra :
బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర లో భాగంగా ఆదివారం రామగిరి మండలం సెంటినరీ కాలనీ సాయిరాం గార్డెన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా అణగారిన వర్గాలకు లబ్ది చేకూరాలేదని, అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం అందరికీ రిజర్వేషన్లు కల్పించాలని ప్రయత్నం చేసినా, కాంగ్రెస్ పార్టీ వల్ల చర్చల వరకే పరిమితమయ్యేదని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ వల్లే భారత దేశంలో ఏ ప్రభుత్వాలు చేయలేని రిజర్వేషన్లు జమ్ము కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తో అమలు జరగడం, G 20 సర్వ సభ్య దేశాలలో భారత దేశం స్థానం దక్కిందని, దానికి గర్వపడుతున్నానని ధీమా వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలకు తెలియని ఇలాంటి విషయాలు జనంలోకి తీసుకెళ్ళి తిరిగి బిజేపి కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి, స్థానిక బిజేపి నేతలు పాల్గొన్నారు.
Vijaya Sankalpa Yatra :
త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి పై బీజేపీ జెండా ఎగరాలని విజయ సంకల్ప యాత్రకు ముఖ్య అతిథులుగా ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి లు అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థాయిలో బీజేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విజయ సంకల్ప యాత్ర శుక్రవారం సాయంత్రం ఎల్బీనగర్ నియోజకవర్గానికి చేరుకుంది. ఈ సందర్భంగా నాగోల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన అయోధ్య రాముని చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. మోదీ ప్రధానమంత్రి కాకముందు మన దేశం ప్రపంచ ఆర్ధిక వృద్దిలో 11వ స్థానంలో వుంటే, మోదీ పదేళ్ల పాలనలో దానిని 5వ స్థానానికి తీసుకువచ్చారని గుర్తు చేశారు. అంతేగాకుండా ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపిన ఘనత ఆయనకు దక్కిందన్నారు. కాంగ్రెస్ పాలనలో దశాబ్దాల తరబడి పరిష్కారానికి నోచని అయోధ్య రామ మందిరం, 370 ఆర్టికల్ రద్దు, మహిళా రిజర్వేషన్ బిల్లు లాంటి వాటిని తనదైన శైలిలో చేసి చూపించారని తెలిపారు. నరేంద్ర మోదీ భారతదేశ ప్రజలకు నిజమైన రాముడిలా, ఆరాధ్య దైవంగా మారారన్నారు. అలాగే పేద, మధ్య తరగతి ప్రజలు, రైతులకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకువచ్చారని వారు గుర్తు చేశారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం వుండదన్నారు. ఇటీవల కేసీఆర్ పై వ్యతిరేకతతో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటువేసి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలు ఇప్పుడు ఆలోచనలో పడ్డారని తెలిపారు. ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు నిధులు లేకపోవడంతో రేవంత్ రెడ్డికి సిఎం పదవి ముళ్ల కిరీటంలా మారిందన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయాలంటే 1.50 వేల కోట్లు అవసరం వుండగా, కేవలం రాష్ట్ర బడ్జెట్లో 60 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగిందన్నారు. ఇక కాంగ్రెస్ తో రాష్ట్రం అభివృద్ధి చెందే పరిస్థితి లేదన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. బీజేపీకి ఓటు వేయడం ద్వారా కేంద్రం ఇచ్చే నిధులతో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని వారు తెలిపారు.




Total views : 194292