లగచర్లలో వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసులో ప్రధాన నిందితుడు బోగమోని సురేష్ కు కోర్టు రెండు రోజుల కస్టడీ విధించింది. పోలీసులు వారం రోజుల కస్టడీ కోరినప్పటికి కోర్టు రెండు రోజుల కస్టడికి అనుమతించింది. దీంతో పరిగి పోలీస్ స్టేషన్ లో సురేష్ ను పోలీసులు ఇవ్వాళ, రేపు కేసు అంశాలపై ప్రశ్నించనున్నారు. లగచర్ల దాడి కేసులో ఏ1 నిందితుడుగా ఉన్న కొడంగల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి, సురేష్ కు మధ్య ఉన్న సంబంధాలు, దాడి సందర్భంగా వారిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు.. చర్చలు ఏమిటన్నదానిపై పోలీసులు సురేష్ ను ప్రశ్నించనున్నారు.
మణికొండలో నివాసం ఉండే సురేష్ లగచర్లకు ఎందుకు రాకపోకలు సాగిస్తున్నారు..దాడిలో ఎందుకు కొంతమంది గిరిజనులనే రెచ్చగొట్టారన్న దానిపై ప్రశ్నలు సంధిస్తారని తెలుస్తోంది. దుగ్యాల మండలం నుంచి కలెక్టర్ సభను లగచర్లకు ఎందుకు మార్పించారన్నదానిపై నిందితుడి నుంచి వివరాలు రాబట్టనున్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, అధికారులపై దాడులు చేసేందుకు పట్నం నరేందర్ రెడ్డి, లేక ఇంకెవరి ప్రోద్భలం ఉందన్న విషయాలపై సురేష్ ను ప్రశ్నించి కేసు విచారణను మరింత పగడ్బందీగా ముందుకు తీసుకెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించనున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు సురేష్ ఎవరి పేర్లు బయటపెడుతారన్నదానిపై ఆసక్తి నెలకొంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా కీలక ముందడుగు పడింది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలు పట్టాలెక్కింది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.…
- పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం.పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో విషాదం నెలకొంది. స్కూల్ బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఓ స్కూల్ బస్సు కర్ణసుబర్ణ రైల్వే క్రాసింగ్ దగ్గర పట్టాలు దాటుతుండగా…
- ఇరాన్పై మరోసారి అమెరికా దాడులు.పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత ఉధృతమయ్యాయి. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటి హర్మూజ్ జలసంధి కేంద్రంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్లోని బ్రిడ్జిలు, రవాణా మార్గాలపై అమెరికా వైమానిక దాడులను మరింత తీవ్రతరం…
- నేడు మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన.ప్రధాని మోదీ ఇవాళ మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. హర్యానా, పంజాబ్, చండీగఢ్లో ప్రధాని పర్యటన సాగనుంది. ఈ పర్యటనలో వివిధ రాష్ట్రాల్లో రూ.26,800 కోట్ల ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. ప్రధాని మోదీ తొలి కార్యక్రమం హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో…
- మళ్లీ పెరిగిపోతోన్న కొవిడ్-19 కేసులు.ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి మళ్లీ కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొత్తగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తక్షణమే అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 26వ తేదీ నుంచి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 212499