టిడిపి ప్రధాన కార్యాదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో ముగియనుంది. జనవరి 27వ తేదిన చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర రాష్ట్రంలో 226 రోజులపాటు 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3132 కిలోమీటర్లు సాగింది. విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నియోజకవర్గంలో యాత్ర ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్లు యాత్ర సాగించాలని ముందుగా టిడిపి భావించింది. ఈ ప్రకారం వచ్చే జనవరిలో శ్రీకాకుళం జిల్లాలో ముగించాల్సి ఉంది. అయితే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుతో సెప్టెంబర్ 9వ తేదితో యాత్ర నిలిచిన విషయం తెలిసిందే. చంద్రబాబు బెయిల్పై వచ్చిన తరువాత నవంబర్ 27 నుంచి తిరిగి ప్రారంభించారు. సుమారు 80 రోజుల పాటు యాత్ర సాగలేదు. మరోపక్క ఎన్నికల సమయం దగ్గర పడటంతో యాత్రను వీలైనంత త్వరగా ముగించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దీంతో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రవేశించకుండానే యాత్ర ముగియనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో ఇబ్బందులు పడుతున్న సకలజనుల గొంతుకను అవుతానని లోకేష్ యాత్ర ప్రారంభానికి ముందు తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు ప్రతి సభలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారని అధికార పార్టీ నేతలపై విమర్శల దాడి చేశారు. అదేవిధంగా యాత్రలో పలు సమస్యలపై అధికార యంత్రాంగానికి 600పైగా లేఖలు రాశారు. పాదయాత్ర పూర్తయిన ప్రతి వంద కిలోమీటర్ల ప్రాంతంలో అక్కడి ఉన్న సమస్యను అధికారంలోకి రాగనే పూర్తిచేస్తానని శిలఫలాకలతో లోకేష్ హామీ ఇచ్చారు. 70 బహిరంగ సభలు, 155 ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8 రచ్చబండ కార్యక్రమాల్లో లోకేష్ పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. భారీ స్థాయిలో ముగింపు సభ, యువగళం విజయోత్సవ సభను టిడిపి భారీస్థాయిలో నిర్వహించనుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో ఈ నెల 20వ తేది విజయోత్సవ సభను జరపనుంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది పార్టీ నేతలు, కార్యకర్తలు వస్తారని అంచనా వేసింది. చిత్తూరు, తిరుపతి, రైల్వే కోడూరు, అనంతపూర్, ఆదోని, నెల్లూరు, మాచర్ల నుంచి ఏడు ప్రత్యేక రైళ్లను టిడిపి సిద్ధం చేసింది. ఈ సభలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొంటారు.
visakhapatnam news
విశాఖ మిథిలాపురి కాలనీలో యథేచ్ఛగా అక్రమ కట్టడాల నిర్మాణాలు జరుగుతున్నాయి.. రెవెన్యూ లేఔట్ లో అర్దరాత్రి అక్రమ గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు. పరదాల చాటున భారీ అక్రమ నిర్మాణం జరుపుతున్నారు. gvmc అధికారులు అక్రమ నిర్మాణానికి కొమ్ముకాస్తున్నారు. Gvmc జోన్ 2 లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ గ్రావెల్ తవ్వకాలు సాగిస్తున్నారు.. ఇంత జరుగుతున్న టౌన్ ప్లానింగ్ విభాగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది. అక్రమ గ్రావెల్ తవ్వకాలతో సమీప భవనాలు కూలిపోతున్నాయి. ఇంత జరుగుతున్నా చోద్యం చూస్తున్న ACP శాస్త్రి కాసులకు కక్కుర్తిపడి అడ్డగోలుగా తవ్వకాలకు సహకరిస్తున్నాడు. ఈ తతంగంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అల్లూరి జిల్లా చింతపల్లి మండలం, జికేవీది మండలం, కొయ్యూరు మండలాల్లో.. మిచౌంగ్ తుఫాన్ కారణంగా ఈదురుగాలులతో పాటు ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావంతో పరిసర ప్రాంత ప్రజలు రహదారులపై రానటువంటి పరిస్థితులలో ఉన్నారు. దీని కారణంగా ఎక్కడికక్కడ విద్యుత్తును నిలిపివేశారు అధికారులు. కొన్ని చోట్ల భారీ వృక్షాలు కూడా కూలిపోవడంతో గిరిజన ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మీచౌంగ్ తుఫాన్ కారణంగా చేతికి అందిన పంట నీటిపాలు అయ్యింది. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో అల్లూరి జిల్లా గిరిజన ప్రాంత ప్రజలు ఉన్నారు.
Read Also…
Read Also…
మిచాంగ్ తుపాను కారణంగా విమాన సర్వీసులను రద్దు చేశారు. ఈ మేరకు ఇండిగో సంస్థ విశాఖపట్నం నుంచి చెన్పై వెళ్లాల్సిన రెండు విమాన సర్వీసులను నిలిపివేసింది. ఒక విజయవాడ సర్వీసును రద్దు చేసింది. తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడులోనూ కనిపిస్తోంది. దీంతో కోయంబత్తూరు-చెన్నై మధ్యలో రెండు విమాన సర్వీసులను ఇండిగో సంస్థ రద్దు చేసింది. చాలా విమానాలను చెన్నై ఎయిర్ పోర్టు నుంచి బెంగళూరులోని కెంపెగౌడ్ విమానాశ్రయానికి మళ్లించారు. ఇప్పట వరకు దాదాపు 11 విమానాలను దారి మళ్లించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర డిసెంబరు 17తో ముగియనుంది. భీమిలి నియోజకవర్గంలో యువగళం ముగింపు సభను భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఈ మేరకు టీడీపీ విశాఖ పార్లమెంటు స్థానం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. యువగళం పాదయాత్ర డిసెంబరు 6న అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేటకు చేరుకుంటుందని, పాయకరావుపేట 7న మొదలయ్యే యువగళం డిసెంబరు 17తో సమాప్తం అవుతుందని పల్లా శ్రీనివాసరావు వివరించారు. నారా లోకేశ్ జనవరి 27న కుప్పంలో యువగళం పాదయాత్ర షురూ చేశారు. 4 వేల కిలోమీటర్లు, 400 రోజుల పాటు పాదయాత్ర సాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మధ్యలో చంద్రబాబు అరెస్ట్ కావడంతో యువగళానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇటీవలే లోకేశ్ యువగళాన్ని పునఃప్రారంభించారు.
గెజిటెడ్ అధికారి అయిన ఓ ఎంపీడీవోపై మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే బహిరంగ వేదికపై దుర్భాషలాడారు. ఎవడ్రా నువ్వు ఏం తమాషాలు చేస్తున్నావా ఏం మాట్లాడుతున్నావు అని మండిపడ్డారు. ఇదీ అయ్యప్ప మాలలో ఉండి కూడా ఆయన ఇలా చిందులు తొక్కడం తీవ్ర చర్చనీయాంశమైంది. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం రేవిడి గ్రామంలో శుక్రవారం సాయంత్రం ‘ఆంధ్రప్రదేశకు జగనే ఎందుకు’ కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల కృష్ణాపురం, పాండ్రంగి తదితర గ్రామాల్లో జరిగిన ఈ కార్యక్రమాల ఫొటోలు ఎందుకు అప్లోడ్ చేయలేదంటూ మండల వైకాపా అధ్యక్షుడు కోరాడ లక్ష్మణరావు ఎంపీడీవో విజయ్ కుమార్ ను ప్రశ్నించారు. ఆ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొనకపోవడంతో వాటికి సంబంధించినవి అప్లోడ్ చేయలేదని ఎంపీడీవో సమాధానమిచ్చారు. దాంతో ఎమ్మెల్యే బహిరంగ సభ అని కూడా చూడకుండా అందరి ముందూ ఎంపీడీవో ను నోటికొచ్చినట్లు మాట్లాడారు! ఒక దశలో ఎంపీడీవోపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు సుంకర గిరిబాబు వారించారు.
ఇటీవల పాండ్రంగిలో కార్యక్రమం రసాభాస కావడంతో సంక్షేమ పథకాల బోర్డు ఆవిష్కరించకుండానే ఎమ్మెల్యే వెనుదిరిగారన్నారు. తర్వాత సర్పంచి దాన్ని ఆవిష్కరించడంతో ఆ ఫొటోను సిటిజన్ అవుట్ రీచ్ యాప్లో అప్లోడ్ చేశామని, ఆ విషయం సభలో వివరిస్తుండగా ఒక్కసారిగా ఎమ్మెల్యే ఆగ్రహించారని చెప్పారు.





Total views : 78566