ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం ఎర్ర వారి గూడెం సమీపంలో పులి సంచారం జరుగుతుందని జోరుగా ప్రచారం సాగుతుంది. గ్రామ శివారు పొలాల్లో గుర్తుతెలియని పాదముద్రలను గ్రామస్తులు గుర్తించారు. అది పులి అడుగుజాడలుగా గ్రామస్తులు భావిస్తూ భయభ్రాంతులకు గురవుతున్నారు. పొలంలోకి వెళ్లి సాగు చేసుకోవడానికి ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా తమ గ్రామంలోకి పులి వస్తుందేమే అనే భయంతో బిక్కుబిక్కున బతుకుతున్నారు. ఫారెస్ట్ అధికారులు వచ్చి తమకు రక్షణ కల్పించాలని మరియు పులిని పట్టుకుని మా గ్రామాన్ని రక్షించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఈ సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలియజేశామని గ్రామస్తులు చెపుతున్నారు.
west godavari news
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో మునిసిపల్ అధికారులు చేపట్టిన ఫ్లెక్సీలు తొలగింపు వివాదం గా మారింది. అధికార వైసిపి పార్టీకి చెందిన ఫ్లెక్సీలు తొలగించకుండా టిడిపి జనసేన ఫ్లెక్సీలు మాత్రమే తొలగిస్తున్నారని టిడిపి జనసేన నేతల ఆందోళన కు దిగారు. మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగారు దీంతో నర్సాపురం పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితిలు నెలకొన్నాయి. ఫ్లెక్సీలు తొలగింపు నిలుపుదల చేయాలని రోడ్డుమీద బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా టిడిపి జనసేన నేతలు మాట్లాడుతూ అధికార వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తుందని వైసిపి బస్సుయాత్రకు పెట్టిన ఫ్లెక్సీలను తొలగించుకుండ జనసేన ఇన్చార్జ్ బోమ్మడి నాయకర్, చాగంటి మురళీకృష్ణ, టిడిపి కి చెందిన కొవ్వలి నాయుడు ఫ్లెక్సీలు మాత్రమే తొలగిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ సంఘటన ప్రాంతానికి రావాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంబేద్కర్ సెంటర్ జాతీయ రహదారిపై ధర్నా చేయడంతో రహదారి కి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.





Total views : 79721