భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం అమరారం గ్రామంలో ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి కొత్తూరు గ్రామం నుండి భార్యా భర్తలైన గోగ్గేల రవీందర్, గొగ్గేల సూర్యకాంతం (23 ) ముగ్గురు పిల్లలతో కలిసి బైక్ పై వెల్లుతుండగా మార్గమధ్యలో తేనేటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. ముగ్గురు పిల్లలు, ఆమె భర్త రవీందర్ సైతం తేనెటీగల దాడిలో గాయపడ్డారు. బైక్ పై నుండి కింద పడడంతో తేనెటీగలు విపరీతంగా కుట్టడంతో గోగ్గల సూర్యకాంతం (23) అనే మహిళ పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యలు పల్స్ రికార్డు కాలేదని, బాడీ మొత్తం విపరీతంగా వాపు కనిపించడంతో మెరుగైన వైద్యం కోసం మణుగూరు 100 పడకల ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహిళా మృతి చెందింది.
Tag:
Women Died
అల్లూరి జిల్లాలో ఘోర ఘాట్ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు బయలుదేరిన ఇన్నోవా కారు లోయలోకి దూసుకుపోవడంతో ఘోర రోడ్ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో 11 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఒక మహిళా మృతి చెందింది. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. బాధితులను స్థానిక అరుకు ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికులు అందరూ ఒకే కుటుంబంకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. విశాఖపట్నం, మాధవధారకు చెందిన వారుగా గుర్తింపు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.





Total views : 78685