నా ఏస్సి, బిసి అంటూ నమ్మించి గోంతుకోస్తున్న వ్యక్తి జగన్ బస్సు యాత్ర కి నైతికత లేదు.. అది సామాజిక బస్సుయాత్ర కాదు.. జగన్ సిఏం అయ్యాక ఆరువేల మంది దళితులపై దాడి చేసారు.., హత్యలు చేసారు.. 80% దాడులు చేసింది కూడా రెడ్డి సామాజిక వర్గం వారే.. ఎమ్మెల్సీ అనంత బాబు మర్డర్ చేసి డోర్ డెలివరీ చేస్తే.. రాచ మర్యాదలు.. కంచికచర్లలో శ్యాం కుమార్ అనే దళితుడిని అమానుషంగా చంపారు.. బీహార్ ని తలపిస్తుంది ఆంద్రా.. దళితులు ,ఎస్టి ,బీసి ల పై దాడులు జరుగుతుంటే మంత్రులకు సిగ్గు లేదా యాత్రలు చేయడానికి.. మంత్రి నాగార్జున కి మంత్రిగా కొనసాగే అర్హతేలేదు.. జబర్దస్త్ రోజా చెప్పినట్లు.. గన్ కంటే ముందు వస్తాడన్న జగన్ ఏమయ్యారు.. ప్రజలను డైవర్ట్ చేయడానికే సామాజిక బస్సుయాత్ర దళిత మహిళలపై దాడుల కేసుల్లో ఏపి దేశంలో నెంబర్ వన్ అని NCRB ప్రకటించింది. 26 వేల కోట్ల రూపాయిలు ఎస్ సి సబ్ ప్లాన్ నిధులు డైవర్ట్ చేస్తే… ఏం చేస్తున్నారు దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు. 50 వేల బ్యాక్ లాగ్ ఉద్యోగాలు ఖాలీ ఉన్నాయి. తమ జాతికి అన్యాయం జరుగుతున్నా ఏందుకు మౌనంగా ఉంటున్నాయి దళిత సంఘాలు..
ycp
రాష్ట్రంలో బ్రిటిష్ పాలన కన్నా చాలా దరిద్రమైన పాలన కొనసాగుతోంది….. సీఎం జగన్ మోహన్ రెడ్డి తనపై ఉన్న కేసుల నుంచి ఎన్నిసార్లు ఎస్కేప్ కాలేదు… జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేయని తప్పంటూ లేదు… రాష్ట్రంలో అన్ని రంగాలను సిఎం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నిర్వీర్యం చేశాడు… జగన్మోహన్ రెడ్డి పెద్ద మార్కెట్, ఎమ్మెల్యేలు చిన్న మార్కెట్లు, నాయకులు చిల్లర మార్కెట్లు… ఎర్రచందనం ఇష్టం వచ్చినట్లు అమ్మింది వాస్తవమా కాదా… స్టిక్కర్ లిక్కర్ కింగ్ సిఎం జగన్మోహన్ రెడ్డీ…. కనికరం లేని కనకమహారాజు సీఎం జగన్మోహన్ రెడ్డి…. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని విమర్శించే అర్హత దగుల్బాచీ విజయసాయి రెడ్డికి లేదు… మధ్యంలో భారీ స్థాయిలో దోపిడీ జరిగింది…. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అమీషా కు నివేదిక ఇచ్చారు… పార్లమెంట్ సాక్షిగా విజయసాయి రెడ్డి బిజెపికి మద్దతు ఇవ్వడం లేదా… అసలు విజయసాయి రెడ్డీ ఏ పార్టీలో ఉన్నాడో తేల్చుకోవాలి…. సీబీఐ ఈడి కేసులో ఇరుక్కున్న మాట వాస్తవం కాదా…విజయసాయి రెడ్డి తప్పు చేయలేదా…. వివేకానంద రెడ్డిని హత్య చేసిందేవరో తెలియదా…. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శంకర్ రెడ్డిలు నిందితులు కాదా… రాష్ట్రానికి చేసింది ఏమి లేదు… స్కిల్ డెవలప్మెంట్ కేసులో పిటిషన్ క్వాష్ అయితే చంద్రబాబు నాయుడు కేసులన్నీ మటాస్ ….
Read Also..
హాజరైన మంత్రి బొత్స సత్యనారాయణ, వైవి సుబ్బారెడ్డి, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత పాలకుల మాదిరిగా మాటలకే పరిమితమవకుండా జిల్లా అభివృద్ధిలో జగన్ మార్క్ కనిపిస్తుందని చెప్పారు. దాదాపు 1200 ఎకరాల విస్తీర్ణంలో బొడ్డవర సమీపంలో ఎస్ ఈ జెడ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని దీని ద్వారా మూడు వేల కోట్లకు పైగా పెట్టుబడులు జిల్లాకు రావటం వల్ల జిల్లాలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు కూడా ప్రారంభమవుతున్నాయని జిల్లా వ్యాప్తంగా రైతులు వర్షాధారం పైనే ఆధారపడి పంటలు పండిస్తున్నారని ఇటువంటి పరిస్థితుల్లో సుజల స్రవంతి లాంటి ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా రైతులకు సాగునీరు అందించవచ్చునని తెలిపారు రాష్ట్రంలో సంక్షేమ ఫలాలను అట్టడుగు స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఒక్క వైకాపా ప్రభుత్వానిదే అని చెప్పారు…
త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న వేల వరికపూడి శాలా శంకుస్థాపన చేస్తారని చెప్పడం చాలా హస్యాద్పదంగా ఉందని ఆరోపించారు. వరికపూడి సాల ప్రాజెక్ట్ పూర్తి చేసేది జనసేన టిడిపి ప్రభుత్వమే . పల్నాడు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి బటన్ నొక్కడం తప్ప రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. మాచర్ల పట్టణంలో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. 2024 ఎలక్షన్ తర్వాత వైసీపీ పార్టీ భూస్థాపితం ఖాయం అని అరోపించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి పులి హరి మాచర్ల మండల అధ్యక్షుడు జి సాంబశివరావు వెల్దుర్తి అధ్యక్షుడు గంధం మల్లయ్య మరియు లాల్ కృష్ణ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Read Also..
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి ప్రభుత్వ పాఠశాలలో జగన్నన్న గోరుముద్ద పథకంలో మరోసారి బయటపడ్డ కుంభకోణం…. విద్యార్థులకు అందించే రాగిపిండి , బెల్లం డేట్ కొట్టేసి ఉన్న వాటిని స్కూల్ అధికారులు వాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ జగనన్న గోరుముద్ద పిల్లలకు గోరి కడుతుందని, నాణ్యతలేని మరియు గడువు తేదీ ముగిసిన ఆహార పదార్థాలను వాడి పిల్లలకు పెడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజుల క్రితం దాచేపల్లి మండలంలో ఫుడ్ అధికారుల తనిఖీలో బయటపడ్డ ఎక్స్పైర్ అయిపోయిన రాగి పిండి మరియు బెల్లం ప్యాకెట్లు… ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు…. ఇలా పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
గుంటూరు జిల్లా టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభకార్, అధికార పార్టీ చేస్తున్న సాధికార యాత్ర పై విమర్శలు చేశారు. అర్భన్ పార్టీ కార్యాలయం లో ప్రభాకార్ విలేకర్లతో మాట్లాడుతూ సాధికార యాత్రకు జనంలో వీసమెత్తు స్నందన కూడా లేదన్నారు. గుంటూరు తూర్ను నియోజకవర్గంలో ఏం చేశారని బస్సు యాత్రలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఇక్కడ ఉన్న యం.ఎల్.ఏ ఒక కమెడియన్ అని ఎద్దేవా చేశారు.నియోజకవర్గ అభివృద్ధి పై ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ కుంటి సాకులతో కలం గడిపారు. ఎన్నికల సమయం వచ్చే సరికి ప్రజలను మబ్బేపెట్టనందుకు కొత్త యాత్రలు తేరా మీదకు తీసుకువచ్చారు. వైసిపి పార్టీ నిర్వహించే ప్రతి సమావేశానికి వైసిపి నాయకులూ బెదిరించి మరీ తరలించుకొచ్చిన డ్వాక్రా మహిళలు, పథకాల లబ్ధిదారులు నేతల ప్రసంగాలు మొదలెట్టగానే పరారవుతున్నారు. కొందరైతే స్థానిక సమస్యలపై నిలదీస్తున్న నాయకుల్లో ఎలాంటి స్పందన లేదు.బస్సు యాత్రకు భారీగా జనసమీకరణ చేయాలంటూ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వస్తున్నాయి.
పాలకొల్లు పట్టణ పరిధిలోని పేదలకు, మహిళలకు నివాసయోగ్యం కాని ఒక సెంటు ముంపు స్థల పట్టా ఇచ్చి జగన్ ప్రభుత్వం దగా, మోసం చేసినందుకు నిరసనగా పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, లబ్ధిదారులు, టిడిపి శ్రేణులతో కలిసి మహా పాదయాత్ర ద్వారా వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. పూలపల్లి అంబేద్కర్ విగ్రహం నుండి శివదేవుని చిక్కాల నక్కల పుంత వరకు 15 కిలోమీటర్ల పొడవునా వందలాది మంది లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే నిమ్మలతో కలిసి నడుస్తూ నిరసనగళం విప్పి కదం తొక్కారు. ఇళ్ల స్థల పట్టాల పేరుతో ప్రభుత్వం దగా, మోసం చేసిందని ప్లకార్డులను ప్రదర్శించారు. పట్టణ పరిధిలోని పేదలకు 20 కిలోమీటర్ల దూరంలో ఇళ్ల స్థల పట్టా ఇస్తే చదువులు, జీవనం ఎలా గుతుందన్నారు. పనికిరాని ముంపు భూముల్లో సెంటు స్థలం ఇస్తే పూడికకే రూ 5 లక్షల ఖర్చు అవుతుంది. ఇక ఇల్లు కట్టేది ఎలా ఇది మోసం, దగా కాదా. పనికిరాని సెంటు స్థలం ఇవ్వడం వలన పేదలకు గోరంత.. వైసీపీ నాయకులకు కొండంత మేలు జరిగింది. పట్టణ పరిధిలోనే పేదలు, మహిళలకు సెంటున్నర ఇళ్ల స్థల పట్టా ఇచ్చేవరకు నా పోరాటం ఆగదన్నారు.
Read Also..
వైసీపీ ఏంపీ విజయసాయి రెడ్డి ఏపీ బీజేపీ ఛీఫ్ పురందేశ్వరిపై మరోసారి ఫైర్ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ ను ఖండించడం, ఏపీలో లిక్కర్ స్కాంపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరడం వంటి అంశాల నేపథ్యంలో, విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. తాజాగా పురందేశ్వరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పురందేశ్వరి పదవుల కోసం బీజేపీలో చేరి ఆ పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టడానికి పనిచేస్తున్నారని అన్నారు.ఎయిరిండియా ఇండిపెండెంట్ డైరెక్టర్ గా కేంద్రంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, ఆ విమానయాన సంస్థ అమ్మకం విషయంలో మీరు మధ్యవర్తిత్వం చేసి ఆ సంస్థ నుంచి ముడుపులు తీసుకున్నది వాస్తవం కాదా? అని పురందేశ్వరిని సూటిగా ప్రశ్నించారు. ఈ విషయంలో మీ నిజాయతీని నిరూపించుకోవడానికి సీబీఐ విచారణకు సిద్ధమేనా? ఆ మేరకు కేంద్రానికి లేఖ రాయాలంటూ సవాల్ విసిరారు. మద్యం సిండికేట్ బ్రోకర్ల దగ్గర మీ కుటుంబ సభ్యులు ముడుపులు తీసుకున్నారని అన్నారు.హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో అత్యంత ఖరీదైన విల్లాను ఎలా నిర్మిస్తున్నారని, ఆ విల్లాకు సొమ్ము ఎవరు ఇస్తున్నారంటూ పురందేశ్వరిపై విజయసాయిరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో రోడ్డు ప్రమాదం… కడప జిల్లా కాశినాయన జడ్పీటీసి సత్యనారాయణరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ నుంచి పోరుమామిళ్ల వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తాపడటంతో ప్రమాదం జరిగింది. ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. హుటాహుటిన ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, వైసీపీ నాయకులు బయలుదేరారు. సంఘటనపై పూర్తి వివరాలు దర్యాప్తు చేస్తున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా పిలుపునిచ్చిన సామాజిక సాధికారత బస్సుయాత్ర పిలుపు నేపథ్యంలో గుంటూరులో తూర్పు నియోజకవర్గంలో చేపట్టనున్న బస్సు యాత్ర ప్రతిష్టాత్మకంగా తన భుజాలపై వేసుకొని నడిపిస్తున్న తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా తనయురాలు నూరి ఫాతిమా.. తను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక సాధికారత బస్సు యాత్ర కార్యక్రమంలో తనకు నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు, రాష్ట్రస్థాయిలోని పెద్దలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తున్నారు అంటూ, వచ్చే ఎన్నికలలో తూర్పు నియోజకవర్గ సీటు తనదే అంటున్న తూర్పు ఎమ్మెల్యే తనయురాలు గుంటూరు జిల్లా వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నూరి ఫాతిమా.
Read Also..